Home » మోసపోయిన సెహ్వాగ్.. ఆడుకుంటున్న ఫ్యాన్స్..!

మోసపోయిన సెహ్వాగ్.. ఆడుకుంటున్న ఫ్యాన్స్..!

by Azhar
Ad

భారత మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ గురించి ఎవ్వరికి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. క్రికెట్ ఆడుతున్న సమయంలో గ్రౌండ్ లో ఎంత చురుకుగా ఉండేవాడో ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు. కాకపోతే అప్పుడు బ్యాటింగ్ లో తన జోరును చూపించిన సెహ్వాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తన జోరును చూపిస్తున్నాడు. అయితే సెహ్వాగ్ ట్విట్టర్ లో ఎంత యాక్టివ్ గా ఉంటాడో అందరికి తెలుసు. మన ఇండియా జట్టు గురించి ఏ దేశ మాజీ ఆటగాడు అయినా సరే ఏదైనా ట్విట్ అనేది చేస్తే.. దానికి సమాధానం ఇవ్వడంలో సెహ్వాగ్ ముందుటాడు.

Advertisement

ఇక కేవలం క్రికెట్ విషయంలో మాత్రమే కాకుండా.. ఇంకా ఏ క్రీడా రంగానికి చెందిన ఏ ఆటగాడు అయినా సరే ఏదైనా ఘనత అనేది సాధిస్తే వారికీ ట్విట్టర్ వేదిక కంగ్రాట్స్ చెబుతుంటాడు. కానీ ఇప్పుడు అలాంటి విషయంలో సెహ్వాగ్ దారుణంగా మోసపోయాడు. అతను చేసిన ఓ ట్విట్ అనేది ఇప్పుడు వైరల్ అవుతుంది. అయితే నిన్నటి నుండి బర్మింగ్హోమ్ వేదిక కామన్వెల్త్ గేమ్స్ 2022 అనేవి ప్రారంభమయ్యాయి. ఇందులో మన అథ్లెట్లు 60 మందికి పైగానే పాల్గొంటున్నారు. అయితే అందులో కొంతమంది తప్పకుండ మన ఇండియాకు పథకం అనేది సాధిస్తారు అనే నమ్మకం ఉంది. అందులో స్ప్రింటర్ హిమా దాస్ కూడా ఉంది.

Advertisement

మన ఇండియాకు 2020 ఆసియా గేమ్స్ రెండు గోల్డ్ మెడల్స్ సాధించిన హిమా దాస్ ఇప్పుడు కూడా ఇండియాకు పథకం తెస్తుంది అని అందరూ అనుకుంటున్నారు. ఆయా క్రమంలోనే ఆమె 2020 లో స్వాధీన గోల్డ్ మెడల్ యొక్క వీడియోను ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తూ.. ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్ 2022 లో ఆమె గోల్డ్ సాధించి అంటూ పోస్టులు ప్రారంభించారు. ఐటీబీ ఇవి చుసిన సెహ్వాగ్.. కూడా హిమా దాస్ కు కంగ్రాట్స్ చెబుతూ ఓ ట్విట్ చేసాడు. కానీ తర్వాత తన తప్పు తెలుసుకొని దానిని డిలీట్ అనేది చేసాడు. కానీ అప్పటికే ఆ ట్విట్ ను స్క్రీన్ షాట్స్ తీసిన ఫ్యాన్స్ ఇప్పుడు సెహ్వాగ్ ను ట్రోల్ చేయడం ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి :

కోహ్లీ సెంచరీ చేసిన ప్రయోజనం లేదంట..!

పాకిస్థాన్ ను మట్టికరిపించిన ఇండియా…!

Visitors Are Also Reading