ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా రానించిన చాలా మంది ప్రస్తుతం గుర్తు పట్టలేనంతగా మారిపోయారు. ఇక కొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్ లు హీరోలుగా హీరోయిన్ లుగా కూడా ఎంట్రీ ఇస్తూ బిజీ అయ్యారు. రీసెంట్ గా బలగం సినిమాలో హీరోయిన్ గా నటించిన కావ్య కల్యాణ్ రామ్ ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరో తేజ సజ్జ కూడా ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేశాడు.
Also Read: మోహన్ బాబు పవన్ కల్యాణ్ మధ్య బాక్సాఫీస్ యుద్దం…ఇద్దరిలో ఎవరు గెలిచారంటే..?
Advertisement
ఇదిలా ఉంటే ఇప్పుడు ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన అమ్మాయి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మహేశ్ బాబు వెంకటేష్ హీరోలుగా నటించిన సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమా ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. కాగా ఈ సినిమాలో ఏంటి కూలెక్కలేదా అంటూ గోదావరి యాసలో అదరగొట్టిన చైల్డ్ ఆర్టిస్ట్ పేరు రచన.
అయితే ఈ సినిమా తరవాత రచన ఇతర సినిమాలలోనూ పెద్దగా నటించలేదని సమాచారం. అంతే కాకుండా ఇప్పుడు రచన గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. అదేవిధంగా సినిమాలకు పూర్తి దూరంగా ఉండటంతో పాటూ ఇద్దరు పిల్లలకు తల్లయ్యింది కూడా. రచన కు 2019 లోనే వివాహం జరిగింది. ప్రస్తుతం రచన భర్త పిల్లలతో కలిసి సింగపూర్ లో ఉంటోంది.
ఇక రచన సినిమాలకు గుడ్ బై చెప్పినప్పటికీ సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులకు దగ్గరగానే ఉంటుంది. తన ఫోటోలను మరియు పిల్లల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఇక రచన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు చైల్డ్ ఆర్టిస్ట్ ఇంత మారిపోయిందా అంటూ ఆశ్చర్యపోతున్నారు.
Also Read: భోళాశంకర్ సినిమా పై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ ఇవే..!