Home » సావిత్రి చనిపోయే వరకు ఆ ఒక్క వస్తువు గురించి మాత్రం ఎవరికీ చెప్పలేదట..ఏంటది..?

సావిత్రి చనిపోయే వరకు ఆ ఒక్క వస్తువు గురించి మాత్రం ఎవరికీ చెప్పలేదట..ఏంటది..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా చరిత్రలో తారాస్థాయికి ఎదిగిన చక్కని చుక్క మహానటి సావిత్రి. ఆమె నటన గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. రాతలు సరితూగవు. అంతటి అభినయం కలిగిన సావిత్రి తన జీవితంలో ఎన్నో సినిమాల్లో నటించి మహానటి గా పేరు తెచ్చుకుంది. హీరోయిన్ అంటే తెల్లగా ఉండాలి , నడుము సైజు ఇంతే ఉండాలి, అని ఉన్న రోజుల్లో కూడా సావిత్రి అన్నింటికి మినహాయింపు అని చెప్పవచ్చు. సావిత్రి సినిమాల్లో ఎంత సౌందర్యవతి గా ఉండేవారు. కానీ బయట మాత్రం నల్లగా కనిపిస్తూ ఉండేవారు. కానీ సావిత్రిని ఎవరైనా నువ్వు నల్లగా ఉన్నావని అంటే మాత్రం అస్సలు ఒప్పుకునేది కాదట.

Advertisement

also read;పవన్ కళ్యాణ్, చిరంజీవిలది ముఖ్యమంత్రి స్థాయి : కమెడియన్ పృథ్వీ రాజ్

Advertisement

అలిగి ఒక మూలన కూర్చునేదట. ఆమె సినిమాల్లోకి రాకముందే సావిత్రి చిన్ననాటి స్నేహితురాలు సుశీలతో ఒక స్కూల్లో రాధాకృష్ణ వేశం వేసినప్పుడు నల్లగా ఉంది కాబట్టి ఈ అమ్మాయి కృష్ణుడి వేషం వేయండి అని నవ్వితే సావిత్రి అలిగి అక్కడి నుంచి వెళ్ళిపోయిందట. ఆమెకు ఒంటి రంగు నల్లగా ఉండడం నచ్చేది కాదు. కానీ ఆమె ఆ ఛాయ కనిపించకుండా పసుపు రాసుకొని స్నానం చేసేదట. ఆ పసుపులో ఏ ప్రత్యేకత ఉందో కానీ ఆమె శరీరం అంతా చాలా కాంతివంతంగా కనిపించేదట.

దీంతో ఆమె అభిమానులు, సహనటులు ఇంత మంచి పసుపు మీరు ఎక్కడ కొంటారు అని, ఎక్కడి నుంచి తెప్పిస్తారు అని అడిగితే సావిత్రి అస్సలు చెప్పేది కాదట. బజారులో కొంటాను అని తప్పించుకునేదట. అయితే సినిమాల్లో హీరోయిన్ పాత్రలు తగ్గిన తర్వాత పసుపు వాడడం మానేసిందట సావిత్రి. ఆ తర్వాత ఎవరో పసుపు గురించి అడిగితే ఇక్కడే కపాలేశ్వరం షాపులో దొరుకుతుందని చెప్పిందట సావిత్రి. ఈ విధంగా పసుపు సీక్రెట్ ను ఆమె హీరోయిన్ గా చేసినన్ని రోజులు ఎవరికి కూడా చెప్పలేదట.

also read;రోజా కూతురి ఫొటోలు మార్ఫింగ్.. కన్నీరు పెట్టుకున్న నటి

Visitors Are Also Reading