Home » “సర్కారు వారి పాట” సినిమాపై.. కామెంట్ చేసిన ఆనంద్ మహీంద్రా.. ఏమన్నారో తెలుసా..?

“సర్కారు వారి పాట” సినిమాపై.. కామెంట్ చేసిన ఆనంద్ మహీంద్రా.. ఏమన్నారో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

గీతగోవిందం ఫేమ్ పరుశురాం డైరెక్షన్లో భారీ అంచనాలతో రిలీజ్ అయిన సర్కారీ వారి పాట బ్లాక్ బాస్టర్ కొట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు హీరో ఆయన సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఈ మూవీ మే 12వ తేదీన రిలీజ్ అయి ఘన విజయాన్ని అందుకుంది. మూవీ థియేటర్ లోకి వచ్చిన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకు వెళ్ళింది.ఈ సినిమా ఐదు రోజుల్లోనే ప్రపంచం మొత్తం 160.2 కోట్ల గ్రాస్,100.44 షేర్ సాధించి రికార్డు సృష్టించింది. కేవలం ఐదు రోజుల్లోనే వంద కోట్ల షేర్ సాధించిన మొదటి ప్రాంతీయ చిత్రంగా రికార్డు సాధించింది.

Advertisement

మొదట్లో సినిమాను కొంతమంది నెగిటివ్ టాక్ తీసుకువచ్చిన, సినిమా కంటెంట్ బాగుంది కాబట్టి ఆల్టైమ్ రికార్డు తో ముందుకు దూసుకు వెళ్ళింది. ఈ తరుణంలోనే ఈ చిత్రంపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఆసక్తి కరమైన టువంటి ట్వీట్ చేశారు. అనుపమ్ తరేజా పోస్ట్ చేసినటువంటి ఒక వీడియో కు స్పందనగా ఆయన రీ ట్వీట్ చేశారు.

Advertisement

” అన్బిటబుల్ కాంబినేషన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు జావా మెరూన్ లను చూడకుండా ఎలా ఉండగలను. ప్రస్తుతం నేను న్యూ యార్క్ లో ఉన్నాను అని, న్యూజెర్సీకి వెళ్లి మరీ సినిమా ఎక్కడ ప్రదర్శించబడిన అక్కడ చూస్తాను అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆనంద్ మహేంద్ర ఎప్పుడూ ఏదో ఒక విషయంలో ఈ విధంగా కామెంట్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎంతోమందిని ఉత్సాహ పరుస్తారు.

also read;’

కిరాక్ RP కాబోయే భార్య ఎవరో తెలుసా.. మీరు ఎప్పుడు చూడని లేటెస్ట్ ఫొటోస్ వైరల్..?

నా భర్తను అవమానించారంటూ ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్స్ పై సంజూ భార్య ఆగ్రహం..!

 

Visitors Are Also Reading