Home » అభిమానులను కూల్ చేసే ప్రయత్నంలో సంజూ..!

అభిమానులను కూల్ చేసే ప్రయత్నంలో సంజూ..!

by Azhar
Ad

భారత క్రికెట్ లో ప్రస్తుతం ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఆటగాల్లో విరాట్ కోహ్లీ మొదట ఉంటాడు. కోహ్లీ ఇండియా తరపున మ్యాచ్ లు ఆడి ఎన్నో ఘనతలు అందుకున్నతర్వాత ఈ ఫాలోయింగ్ అనేది వచ్చింది. కానీ ఇండియా జట్టుకు కనీసం 30 మ్యాచ్ లు కూడా ఆడని సంజూ శాంసన్ కు కూడా విపరితమైన ఫాలోయింగ్ అనేది ఉంది. ఇప్పుడు ఇండియా జట్టుకు ఆడుతున్న ఎంతో మందికంటే సంజూకు ఫాలోయింగ్ ఎక్కువ.

Advertisement

సంజూకు ఎంతో టాలెంట్ ఉన్న బీసీసీఐ కావాలని అతడిని పక్కన పెడుతుంది అనే ఆలోచనే సంజూకి ఇంత ఫాలోయింగ్ రావడానికి కారణం అనే చెప్పాలి. అయితే ఈ మధ్య ఆసియా కప్ లో రాణించకపోయిన.. ప్రపంచ కప్ లో రిషబ్ పంత్ ను తీసుకొని సంజూ శాంసన్ ను పక్కన పెట్టడం ఫ్యాన్స్ కు తీవ్ర ఆగ్రహం అనేది తెప్పించింది. దాంతో బీసీసీఐకి వ్యతిరేకంగా సంజూ ఫ్యాన్స్ ప్రణాళికలు రచిస్తున్నారు.

Advertisement

కానీ సంజూ మాత్రం వారిని కూల్ చేయడానికి తాజాగా ఓ వీడియో విడుదల చేసాడు. అందులో మాట్లాడుతూ.. భారత జట్టు ప్రపంచ నెంబర్ 1 జట్టు. అందులో చోటు కావాలి అంటే చాలా కష్టపడలి. అయితే నేను పంత్ కు బదులు ఆడాలి.. కేఎల్ రాహుల్ కు బదులు ఆడాలి అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. కానీ వారు నా భారత జట్టుకు ఆడుతున్నారు. నా వారితో పోటీ నాకు వద్దు అని సంజూ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి :

ఐపీఎల్ లో కొత్త రూల్ కోసం బీసీసీఐ ప్రయత్నాలు..?

గుజరాత్ టైటాన్స్‌కు గిల్ బై బై..!

Visitors Are Also Reading