Home » బీసీసీఐకి బుద్ధి చెప్పే పనిలో సంజూ ఫ్యాన్స్..!

బీసీసీఐకి బుద్ధి చెప్పే పనిలో సంజూ ఫ్యాన్స్..!

by Azhar
Ad
భారత జట్టు తరపున ఆడిన మ్యాచ్ లు తక్కువే అయిన.. ఎక్కువ క్రేజ్ అనేది తెచ్చుకున్నా ఆటగాడు ఎవరు అంటే అందరూ సంజూ శాంసన్ పేరు చెబుతారు. అయితే సంజూ ఆట పరంగా అద్భుతమైన ఆటగాడు అయినా.. అతనికి బీసీసీఐ అన్యాయం చేస్తుంది అనే భావన ప్రజలలో చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే సంజూని బీసీసీఐ పట్టించుకోని ప్రతిసారి మన బోర్డుపై విమర్శలు అనేవి ఎక్కువ అవుతాయి.
అయితే తాజాగా ప్రకటించిన ప్రపంచ కప్ జట్టులో కూడా సంజూకి చోటు అనేది లేకపోవడం ఫ్యాన్స్ బీసీసీఐ ట్రోల్ చేసారు. కానీ సంజూ సొంత రాష్ట్రం అయిన కేరళలో మాత్రం బీసీసీఐకి బుద్ధి చెప్పే పనిలో సంజూ ఫ్యాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ నెల 28న కేరళలోని తిరువనంతపురంలో ఇండియా, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య టీ20 మ్యాచ్ అనేది జరగనుంది. ఈ మ్యాచ్ నే టార్గెట్ చేసుకున్నారు సంజూ ఫ్యాన్స్.
ఈ మ్యాచ్ కోసం కేరళకు వచ్చే భారత జట్టుకు అలాగే బీసీసీఐకి తమ నిరసనలు తెలపాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ మ్యాచ్ జరిగే గ్రౌండ్ ముందు అలాగే.. లోపల కూడా సంజూ పేరు ఉన్న షట్స్ అనేవి వేసుకోవాలని డిసైడ్ అయ్యారు. అదే విధంగా ఆటగాళ్లు ఈ మ్యాచ్ కోసం వచ్చి ఉండే హోటల్ ముందు కూడా సంజూకి మద్దతుగా నిరసన కార్యక్రమాలు అనేవి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

Advertisement

Visitors Are Also Reading