Home » 6 ఏళ్లుగా ప్రేమించి.. ఇంకో యువతితో పెళ్లికి రెడీ అయ్యాడు…మరి ప్రియురాలు ఏం ట్విస్ట్‌ ఇచ్చిందంటే…?

6 ఏళ్లుగా ప్రేమించి.. ఇంకో యువతితో పెళ్లికి రెడీ అయ్యాడు…మరి ప్రియురాలు ఏం ట్విస్ట్‌ ఇచ్చిందంటే…?

by Bunty
Ad

తాము ప్రేమించిన‌వాళ్లు ఎక్క‌డున్నా సంతోషంగా ఉండాల‌ని కోరుకోవ‌డమే నిజ‌మైన ప్రేమ‌. కానీ ఇటీవ‌ల కాలంలో అలా కోరుకోవడం కాదు క‌దా ఏకంగా ఈ లోకంలోనే లేకుండా చేస్తున్నారు.  ప్రేమంటే కొందరికి ప్రేమించడం, మర్చిపోవడం అన్నట్లుగా మార్చుకుంటారు. ఓ అమ్మాయిని ఇష్టపడి ఆమెతో జీవితం పంచుకుంటానని మాటిచ్చి, తమ వెంట తిప్పుకొని, కోరికలు తీర్చుకున్న తర్వాత ముఖం చాటేయడం చాలా కామన్ అయిపోయింది. అయితే, తాజాగా సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో కూడా ఓ బీటెక్ చదివిన యువతీ ప్రియుడి చేతిలో మోసపోయానంటోంది.

READ ALSO : MS Dhoni : లవ్ టుడే హీరోయిన్‌తో ధోని మొదటి సినిమా..

Advertisement

రామచంద్రపురానికి చెందిన వినూత్నేశ్వరి పటేల్ గూడలోని ఎల్లంకి కాలేజీలో బీటెక్ చదువుతుండగా, అమీన్ పూర్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు ఈర్ల దేవానంద్ రెండో కుమారుడు ఈర్ల ప్రశాంత్ తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఇద్దరు ఇష్టపడ్డారు. ఆరేళ్లుగా ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. బీటెక్ చదివిన యువతితో పెళ్లి చేసుకుంటానని ఇంతకాలం ప్రేమ వ్యవహారం నడిపిన ప్రశాంత్ సడన్ గా వేరే ఆమె యువతితో శుక్రవారం నిశ్చితార్థం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన ఎంపీపీ దేవానంద్ తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి బాధితురాలి కుటుంబ సభ్యులతో బేరసారాలకు దిగడంతో మనస్థాపానికి గురైంది. తనను ప్రేమించిన వ్యక్తి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడాన్ని తట్టుకోలేక విష పదార్థాలు తిని ఆత్మహ***యత్నానికి పాల్పడింది.

Advertisement

READ ALSO : Sir Movie : “సార్” మూవీ OTT డేట్ లాక్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ప్రేమించిన వ్యక్తి తనను తిరస్కరించాడనే మనస్థాపనతో పురుగుల మందు తాగింది. యువతిని పటాన్ చెరువు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. అయితే మీడియాతో మాట్లాడిన బాధితురాలు తనకు ప్రియుడు ప్రసాద్ తోనే వివాహం జరిపించాలని కోరుతుంది. ప్రేమించి ముఖం చాటేసిన ప్రియుడు తండ్రి పలుకుబడి చూసుకొని పరస్పర ఒప్పందం కుదురుచుకుంటాడా లేక యువతిని పెళ్లి చేసుకొని న్యాయం చేస్తాడో చూడాలి.

READ ALSO: మాస్టర్ సినిమా హీరోయిన్ సాక్షి శివానంద్ ఎంతలా మారిపోయిందో చూడండి!

Visitors Are Also Reading