Home » వైజాగ్ సాయి ప్రియ సీన్ యూపీలో రిపీట్….! ఉంటే ప్రియుడితోనే లేదంటే….?

వైజాగ్ సాయి ప్రియ సీన్ యూపీలో రిపీట్….! ఉంటే ప్రియుడితోనే లేదంటే….?

by AJAY
Ad

ఈ మధ్య పెళ్లి తరవాత చిన్న గొడవలు వచ్చినా భార్యా భర్తలు విడిపోయి ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. అంతే కాకుండా పెళ్లి తర్వాత గొడవలు వస్తే చాలు తమ మాజీలతో కలిసి జంప్ అవుతున్నారు. ఈ రీసెంట్ ఇలాంటి ఘటన ఏపీలోని విశాఖపట్నంలో జరిగింది. వైజాగ్ లో సాయి ప్రియ అనే వివాహిత తన భర్తతో కలిసి బీచ్ కు వెళ్ళింది. భర్త ఫోన్ చూస్తూ బిజీగా ఉండడంతో ఆమె ఒక్కసారిగా అక్కడి నుంచి కనపడకుండా పోయింది.

దాంతో సాయి ప్రియ ఆచూకీ కోసం సముద్రంలో కోటి రూపాయలతో ప్రభుత్వం గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపింది. ఇక సీన్ కట్ చేస్తే సాయి ప్రియ తన ప్రియుడితో వెళ్లిపోయారని అతడిని పెళ్లి చేసుకున్నానని తండ్రికి మెసేజ్ పెట్టింది. తన కోసం వెతకవద్దని చావైనా బ్రతికైనా ప్రియుడుతోనే ఉంటానని తేల్చి చెప్పింది.

Advertisement

Advertisement

విడదీయాలని ప్రయత్నిస్తే తాను చనిపోతానని హెచ్చరించింది. ఈ వార్త రెండు తెలుగు రాష్ట్రాలలోనూ హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పుడు అచ్చం ఇలాంటి ఘటనే బీహార్ లోని భోజ్ పూర్ లోనూ చోటుచేసుకుంది. భోజ్ పూర్ కు చెందిన ఓ యువతికి బాక్సర్ జిల్లా కు చెందిన యువకుడితో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కొంతకాలం ఈ జంట కలిసి మెలిసి ఉన్నారు. అయితే భర్తతో గొడవ అనంతరం భార్య ఇంటి నుండి పారిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతిని భోజ్ పుర్ కు కొంత దూరంలో రజీత్ కుమార్ అనే యువకుడితో ఉన్నట్టు గుర్తించారు.

అనంతరం ఇద్దరినీ పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి విచారించగా సంచలన నిజాలు బయటపడ్డాయి. తాను పెళ్ళికి ముందే రజిత్ కుమార్ ను ప్రేమించానని యువతి వెల్లడించింది. తనకు పెళ్లి ఇష్టం లేకున్నా బలవంతంగా చేశారని చెప్పింది. ఇక పెళ్లి తర్వాత తన భర్త తరచూ గొడవ పడుతున్నాడని… ఆ కారణంతో తాను మళ్ళీ రజీత్ కుమార్ కు దగ్గర అయ్యానని చెప్పింది. ఇప్పుడు తాను అతడితోనే ఉంటానని కాదంటే చనిపోతానని బెదిరిస్తోంది.

Visitors Are Also Reading