టాలీవుడ్ లవ్లీ కపుల్ సమంత నాగచైతన్యలు విడాకులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐదేళ్లపాటూ అన్యోన్యంగా ఉన్న వీరిద్దరూ సడెన్ గా విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఇక విడాకుల తరవాత సమంత చైతూ ఫుల్ గా బిజీగా మారిన సంగతి తెలిసిందే. అటు సమంత ఇటు చైతూ ఇద్దరూ సినిమాలతో బిజీగా మారిపోయారు. విడాకుల తరవాత చైతూ బంగార్రాజు, లవ్ స్టోరీ సినిమాలతో మంచి విజయాలు అందుకున్నాడు.
సమంత పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ ఊ అంటావా మామా ఊఊ అంటావాతో కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేసింది. ఈ పాటతో యూట్యూబ్ ను షేక్ చేసింది. ఇదిలా ఉంటే సమంత సినిమాలతో పాటూ బిజినెస్ లోనూ తగ్గేదే లే అంటున్న సంగతి తెలిసిందే. విద్యారంగంతో పాటూ సమంత క్లాతింగ్ బిజినెస్ చేస్తోంది. ఇక తాజాగా సమంత ఈ కామర్స్ వ్యాపారంలోకి సైతం దిగుతోంది.
ఇప్పటికే ఆన్లైన్ లో దుస్తులను విక్రయిస్తున్న సైస్టెన్ కార్ట్ లో సమంత కూడా పెట్టుబడులు పెడుతోంది. ఉమెన్స్ డే సందర్భంగా సమంత కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టినట్టు ప్రకటించింది. ఇదిలా ఉంటే సైస్టెన్ కార్ట్ రీటెయిల్ అవుట్ లెట్ ను కూడా ప్రారంభించబోతున్నట్టు ప్రకటించింది. ఈ యేడాది ముప్పై ఫ్రాంచైజీలను ప్రారంభించాలని అదే విధంగా వచ్చే ఏడాది వంద ఫ్రాంచైజీలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది.
ఇక సైస్టెన్ కార్ట్ లో ప్రస్తుతం వెయ్యి బ్రాండ్లను విక్రయిస్తున్నారు. ఇక నాగచైతన్య విషయానికి వస్తే రీసెంట్ గా ఆయన రెస్టారెంట్ ను ప్రారంభించారు. హైదరాబాద్ లో ప్రారంభించిన రెస్టారెంట్ కోసం ఓ వీడియోను కూడా చేసారు. ఇప్పుడు సమంత కొత్త బిజినెస్ పెట్టడంతో చైతూకు గట్టిగానే పోటీ ఇస్తుందని నెటిజన్లు అనుకుంటున్నారు.