టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం పాన్ ఇండియా నటిగా మారిపోయింది. నాగచైతన్య తో విడాకుల నేపథ్యం లో కొంతకాలం సమంత తరచూ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే కొంత కాలం తరవాత సమంత పూర్తిగా తన దృష్టిని సినిమాలపై నే పెట్టింది. సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోల్స్ లెక్కచేయకుండా కెరీర్ పైనే ఫోకస్ పెట్టింది.
దాంతో పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ ద్వారా యూట్యూబ్ ను షేక్ చేసింది. దాంతో సమంత కి దేశవ్యాప్తంగా అభిమానులు అయ్యారు. అయితే ఈ సినిమాలో నటించే ముందే సమంత ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరిస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ వెబ్ సిరీస్ బాలీవుడ్ కావడం తో బాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆక్కట్టుకూంది.
Advertisement
Advertisement
ఇక సమంత సినిమాలతో బిజీ గా ఉన్నా కూడా సోషల్ మీడియాలో ఎంతో మంది అభిమానులనుసంపాదించుకుంది. ఇన్స్టా గ్రామ లో సమంత కు ఏకంగా 23మిలియన్ లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. దాంతో సమంత ఒక్కో సోషల్ మీడియా ప్రమోషన్ కు భారీగా పుచ్చుకుంటునట్టు టాక్….ఒక పోస్ట్ కు సమంత గతం లో రూ. 8 లక్షలు తీసుకునే వారట. కానీ ఇప్పుడు ఏకంగా 20 లక్షలు పుచ్చుకకుంటుంది.