Home » మ‌ళ్లీ క‌ల‌వ‌బోతున్న చై-సామ్…ఫ్యాన్స్ కు పండ‌గే…!

మ‌ళ్లీ క‌ల‌వ‌బోతున్న చై-సామ్…ఫ్యాన్స్ కు పండ‌గే…!

by AJAY
Ad

టాలీవుడ్ లో ల‌వ్లీ క‌పుల్ గా గుర్తింపు తెచ్చుకున్న జంట స‌మంత నాగచైత‌న్య‌. ఏమ్మాయ చేసావే సినిమాలో క‌లిసి న‌టించిన వీరిద్ద‌రూ ఒక‌రిమాయలో మ‌రొక‌రు ప‌డిపోయారు. ఆ తర‌వాత పెద్ద‌ల‌ను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్ల పాటూ వీరి వైవాహిక జీవితం సాఫీగానే సాగిపోయింది. కానీ ఏం జ‌రిగిందో తెలియ‌దు కానీ ఇద్ద‌రూ విడిపోవాల్సి వ‌చ్చింది. తాము విడాకులు తీసుకుంటున్నామి డిసెంబ‌ర్ నెల‌లో అధికారికంగా ప్ర‌క‌టించారు.

samantha nagachaithanya

Advertisement

ఇక విడాకుల త‌ర‌వాత విడిపోవడానికి కార‌ణం ఇదే అంటూ మీడియాలో ఎన్నో వార్త‌లు వ‌చ్చాయి. కానీ తాము విడిపోవాడానికి స‌రైన కార‌ణం ఏంటో చైతూ గానీ స‌మంత కానీ బ‌య‌ట‌పెట్ట‌లేదు. ఇక విడాకుల త‌ర‌వాత ఇద్ద‌రూ ఎవ‌రి దారి వాళ్లు చూసుకుని వ‌రుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే వీరిద్ద‌రూ మ‌ళ్లీ క‌ల‌వ‌బోతున్న‌ట్టు టాలీవుడ్ లోవార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

Advertisement

దానికి కార‌ణం ఓ అగ్రిమెంట్ అని తెలిస్తోంది. పెళ్లి త‌ర‌వాత కూడా స‌మంత నాగ‌చైత‌న్య క‌లిసి సినిమాలు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే స‌మంత స్నేహితురాలు ద‌ర్శకురాలు నందిని రెడ్డి ఓ సినిమా క‌థ‌ను రాసింద‌ట‌. ఆ క‌థ‌లో స‌మంత నాగ‌చైత‌న్యల‌ను హీరోయిన్ హీరోలు అనుకుంది. అంతే కాకుండా అప్ప‌టికే ఈ సినిమాకు అగ్రిమెంట్ కూడా చేసుకుంద‌ట‌.

అయితే ఆ తర‌వాత ఇద్ద‌రి మ‌ధ్య వ‌చ్చిన మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా విడాకులు తీసుకున్నారు. కానీ నాగ‌చైత‌న్యకు క‌థ భాగా న‌చ్చ‌డంతో ఇప్ప‌టికీ కూడా ఆ సినిమాలో న‌టించాల‌ని ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నార‌ట‌. కానీ స‌మంత మాత్రం సినిమాలో న‌టించ‌డానికి పెద్ద‌గా ఆస‌క్తిచూప‌డం లేద‌ని టాక్. దాంతో నందిని రెడ్డి స‌మంతను బుజ్జ‌గించే ప‌నిలో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇక స‌మంత కూడా ఓకే చెపితే వీరిద్ద‌రి కాంబోలో సినిమా రావ‌డం ప‌క్కా…అదే గ‌నక జ‌రిగితే వీరిద్ద‌రినీ క‌లిపి చూడాల‌నుకునే ఫ్యాన్స్ కు పండ‌గే.

ALSO READ : RAMCHARAN : చ‌ర‌ణ్ శంక‌ర్ సినిమాలో పాట, ఫైట్ కోసం భారీ బ‌డ్జెట్..ఎన్నికోట్లంటే..!

Visitors Are Also Reading