టాలీవుడ్ అందాలతార సమంత వరుస సినిమాలతో బిజీగా ఉంది. నాగచైతన్యతో విడాకుల తరవాత సమంత కెరీర్ డౌన్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ సమంత కు వరుస ఆఫర్ లు క్యూ కట్టాయి. విడాకుల తరవాత సమంత గ్లామర్ పాత్రలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బాలీవుడ్ లోనూ ఆఫర్ లు వస్తున్నాయి. సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది.
Advertisement
వెబ్ సిరీస్ డీ గ్లామర్ పాత్రలో నటించి ప్రేక్షకుల చేత ప్రశంసలు అందుకుంది. అంతే కాకుండా విడాకుల తరవాత పుష్ఫ సినిమాలో ఊ అంటావా అనే ఐటమ్ పాటకు స్టెప్పులు వేసింది. ఈ పాట యూట్యూబ్ ను షేక్ చేయడంతో పాటూ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఈ పాటలో సామ్ ఎక్స్పెషన్స్ నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. అయితే విడాకుల తరవాత మరింత స్ట్రాంగ్ గా తయారైన సమంత అనారోగ్యం భారిన పడిన సంగతి తెలిసిందే.
Advertisement
సమంత మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడింది. దాంతో చాలా కాలం పాటూ సమంత చికిత్స తీసుకుంటోంది. అయితే రీసెంట్ గా శాకుంతలం సినిమా ప్రమోషన్స్ కోసం సమంత బయటకు వచ్చింది. అయితే చికిత్స తీసుకోవడం వల్ల సమంత వీక్ గా కనిపిస్తుంది. కాగా ఓ మీడియా పోర్టల్ సమంత గ్లామర్ తగ్గిపోయినందుకు బాధగా అనిపిస్తుందని..మయోసైటిస్ ఆమెను తీవ్రంగా బాధిస్తుందని రాసుకొచ్చింది. దానికి సమంత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. మీరు నాలా నెలల పాటూ మందులు వాడే పరిస్థితి రాకూడదని ప్రార్థిస్తున్నా..మీకు మరింత గ్లో రావాలని నా ప్రేమను పంపిస్తున్నా..అంటూ ట్వీట్ కు రిప్లై ఇచ్చింది.