Home » వాళ్ళందరి వెంటపడి చివరికి నా దగ్గరకు వచ్చాడు.. చైతూ పై సమంత కామెంట్స్ వైరల్…!

వాళ్ళందరి వెంటపడి చివరికి నా దగ్గరకు వచ్చాడు.. చైతూ పై సమంత కామెంట్స్ వైరల్…!

by AJAY
Published: Last Updated on
Ad

టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత నాగ చైతన్య గత ఏడాది విడాకులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎవరి సినిమాలతో వాళ్లు ఫుల్ బిజీగా ఉన్నారు. రీసెంట్ గా సమంత హీరోయిన్ గా నటించిన యశోద సినిమా విడుదలై సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక నాగచైతన్య థాంక్యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ తర్వాత లాల్ సింగ్ చద్దా సినిమాతో బాలీవుడ్ కు సైతం పరిచయం అయ్యాడు.

Also Read:  నా కోడ‌లు అలాంటిది అంటూ న‌య‌నతార‌ అత్త సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..నెట్టింట వైర‌ల్..!

Advertisement

ప్రస్తుతం చైతూ కూడా సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే వీరిద్దరూ విడాకులు తీసుకుని ఏడాది గడుస్తున్నా ఈ జంటకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా సమంత నాగచైతన్య పై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఓ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్ లో నటుడు రాహుల్ రవీంద్రన్ తో సమంత నాగచైతన్య పాల్గొన్నారు.

Also Read:   నిఖిల్ కి కోపం తెప్పించిన హీరోయిన్.. ఎందుకో తెలుసా ?

Advertisement

samantha-akkineni

samantha-akkineni

రాహుల్ రవీంద్రన్ చైతూ ని ప్రశ్నిస్తూ… నువ్వు సమంతకు ఎప్పుడు ప్రపోజ్ చేశావని అడిగాడు. దానికి చైతూ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. దాదాపుగా పదేళ్ల ముందు మేమిద్దరం ఏం మాయ చేసావే సినిమా షూటింగ్ లో కలుసుకున్నామని చెప్పాడు. ఆ తర్వాత సమంతను ఇంప్రెస్ చేయడానికి తనకు ఏడేళ్లు పట్టిందని వెల్లడించాడు. అప్పటినుండి సమంతను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నానని అన్నారు.

Nagachithanya family

చివరికి నాకు వేరే ఆప్షన్ లేక సమంతను పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. ఇక సమంతను సైతం రాహుల్ అదే ప్రశ్న అడిగాడు. దానికి సమంత సమాధానమిస్తూ… నాగచైతన్య ఏడేళ్లలో చాలామంది అమ్మాయిల వెంటపడ్డాడు… ఏడేళ్ల తర్వాత నా టోకెన్ నెంబర్ వచ్చింది అంటూ సమాధానం ఇచ్చింది. ఇక ప్రస్తుతం దీనికి సంబంధించిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Also Read:  క‌మ‌ల్ హాస‌న్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సారిక‌తో ఎందుకు విడిపోయారు..?

Visitors Are Also Reading