Home » మాట్లాడినా ఏడ్చినా అది త‌ప్ప‌దు…వైర‌ల్ అవుతున్న స‌మంత పోస్ట్..!

మాట్లాడినా ఏడ్చినా అది త‌ప్ప‌దు…వైర‌ల్ అవుతున్న స‌మంత పోస్ట్..!

by AJAY
Published: Last Updated on
Ad

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత ప్ర‌స్తుతం మ‌యోసైటిస్ తో బాధ‌ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. మ‌యోసైటిస్ అరుదైన ఖండ‌రాల నొప్పుల‌ వ్యాధి. ఇమ్యునిటి పై ఈ వ్యాధి ప్ర‌భావం ఉంటుంది. ఇక స‌మంత చైతూతో విడాకుల త‌ర‌వాత సినిమాల్లో బిజీ అవుతున్న స‌మ‌యంలోనే ఈ వ్యాధి బారినప‌డ్డారు. య‌శోద సినిమా త‌ర‌వాత సమంత శాకుంత‌లం సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న స‌మయంలో అనారోగ్యానికి గుర‌య్యారు.

Advertisement

అప్పుడు వైద్యులు స‌మంత మ‌యోసైటిస్ బారిన‌ప‌డిన‌ట్టు గుర్తించారు. ఇక స‌మంత ఆ వ్యాధితో బాధ‌ప‌డుతూనే శాకుంత‌లం సినిమా షూటింగ్ ను సైతం పూర్తి చేశారు. అంతే కాకుండా ఆ సినిమా డ‌బ్బింగ్ ను కూడా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న స‌మ‌యంలోనే పూర్తి చేశారు. కాగా శాకుంత‌లం సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని విడుద‌ల‌కు సిద్దం అయ్యింది.

Advertisement

ఫిబ్ర‌వ‌రి 17న ఈ సినిమాను విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టించింది. ఇదిలా ఉంటే స‌మంత తాజాగా ఈ సినిమాకు సంబంధించి తాను ఎంతో క‌ష్ట‌ప‌డిన‌ట్టు ఓ పోస్ట్ చేశారు. శాకుంతలం సినిమాలో క‌ష్ట‌మైన అంశం ఏంటి అంటే…మాట్లాడుతున్న‌ప్పుడు, న‌డుస్తున్న‌ప్పుడు, ప‌రిగెత్తుతున్న‌ప్పుడు ఏడుస్తున్న‌ప్పుడు కూడా ద‌య భంగిమ‌ను కొన‌సాగించాలి.

Samantha

Samantha

ద‌య చూపించ‌డం నా వ‌ల్ల కాలేదు దాంతో ట్రైనింగ్ కూడా తీసుకోవాల్సి వ‌చ్చింది. ట్రైనింగ్ కోసం నాషా స‌మంత పెంపుడు కుక్క ను కూడా తీసుకెళ్లాల్సివ‌చ్చింది. అంటూ స‌మంత త‌న కుక్క‌తో దిగిన ఫోటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.

Visitors Are Also Reading