Home » అది ముమ్మాటికీ త‌ప్పే ఆ బాధ నాకు తెలుసు… సాయిప‌ల్ల‌వి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

అది ముమ్మాటికీ త‌ప్పే ఆ బాధ నాకు తెలుసు… సాయిప‌ల్ల‌వి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

by AJAY
Ad

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయిప‌ల్ల‌వి వ‌రుస సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉంది. రీసెంట్ గా సాయిప‌ల్లవి హీరోయిన్ గా న‌టించిన విరాట‌ప‌ర్వం సినిమా విడుద‌లై ప్రేక్ష‌కుల మందుకు వ‌చ్చింది. అయితే ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ భాగంగా సాయిప‌ల్ల‌వి ప‌లు ఇంట‌ర్వ్యూల‌తో ఫుల్ బిజీగా ఉంది. అయితే ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో సాయిప‌ల్ల‌విని కశ్మీరీ ఫైల్స్ సినిమా పై మీ ఉద్ద్యేశం ఏంటి అంటూ ప్ర‌శ్నించారు. దానికి సాయిప‌ల్ల‌వి స‌మాధానం ఇస్తూ క‌శ్మీర్ లో పండిట్ ల పై జ‌రిగింది తప్పు అని అది దారుణం అని అన్నారు.

Advertisement

Advertisement

 

అయితే ఇప్పుడు మ‌న ద‌గ్గ‌ర ఎక్క‌డో ఆవుల‌ను త‌ర‌లిస్తున్నార‌ని డ్రైవ‌ర్ ను ప‌ట్టుకుని కొట్టిచంపార‌ని వాళ్ల‌కు వీళ్ల‌కు తేడా ఏముంద‌ని ప్ర‌శ్నించారు. మతం కంటే మంచిత‌నం మానవ‌త్వం గొప్ప‌వ‌ని అన్నారు. ఇక సాయిప‌ల్ల‌వి చేసిన కామెంట్లు మీడియాలో హెడ్ లైన్స్ గా మారాయి. సాయి ప‌ల్ల‌వి చేసిన కామెంట్ల‌ను బీజేపీ ఖండిస్తోంది. ఎమ్మెల్యే రాజాసింగ్ సాయిప‌ల్ల‌వి చేసిన కామెంట్లను ఖండించారు. అంతే కాకుండా కొంత‌మంది బైకాట్ సాయిప‌ల్లవి అంటూ ర‌చ్చ‌లేపారు. అయితే ఈ విష‌యం పై తాజాగా సాయిప‌ల్ల‌వి ఓ వీడియో వదిలింది. తాను ఇలా వివ‌ర‌ణ ఇస్తూ వీడియోను షేర్ చేయ‌డం మొద‌టిసారి అని చెప్పింది.

SAIPALLAVI

 

తాను లెఫ్ట్ రైట్ ఎవ‌రికీ స‌పోర్ట్ కాద‌ని స్ప‌ష్టం చేసింది. ఒక డాక్ట‌ర్ గా నాకు ప్రాణం విలువ తెలుసు అని అందుకే అలా మాట్లాడాల్సి వ‌చ్చింద‌ని చెప్పింది. నా దృష్టిలో హింస అనేది ముమ్మాటికి త‌ప్పేనంటూ కామెంట్ చేసింది. ఒక డాక్ట‌ర్ గా ప్రాణం విలువ త‌న‌కు తెలుస‌ని…ఒక‌రిప్రాణం తీసే హ‌క్కు మ‌రొక‌రికి లేద‌ని వ్యాఖ్యానించింది. ఇలాంటి క్లిష్ట‌ప‌రిస్థితిలో త‌న వెంట ఉన్న‌వారంద‌రికీ సాయిప‌ల్లవి కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది.

Visitors Are Also Reading