Home » మూడేళ్ల త‌ర‌వాత నాగ‌శౌర్యకు రౌడీ బేబీ కౌంట‌ర్..!

మూడేళ్ల త‌ర‌వాత నాగ‌శౌర్యకు రౌడీ బేబీ కౌంట‌ర్..!

by AJAY

టాలీవుడ్ హీరో నాగ శౌర్య హీరోయిన్ సాయి పల్లవి జంటగా కణం అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమా 2018 లో విడుదల అయింది. కానీ ఈ సినిమా అనుకున్న మేర విజయం సాధించలేదు. కాగా ఈ సినిమా షూటింగ్ సమయంలో నాగ శౌర్య సాయి పల్లవి గొడవ పడ్డారని అనేక వార్తలు వచ్చాయి. ఈ విషయంపై హీరో నాగశౌర్య పలు ఇంటర్వ్యూలలో కూడా మాట్లాడారు. అంతే కాకుండా సాయిపల్లవి పై సంచ‌ల‌న కామెంట్లు చేశారు. సాయి పల్లవి ప్రొఫెషనల్ హీరోయిన్ కాదంటూ నాగశౌర్య వ్యాఖ్యానించారు. అనవసరమైన విషయాలకు కూడా సాయిపల్లవి కోపం తెచ్చుకుని స‌హ‌నం కోల్పోతుందని అన్నారు.

saipallavi nagashourya

saipallavi nagashourya

అది సాయి పల్లవి లో తనకు నచ్చని గుణం అంటూ నాగ శౌర్య తెలిపారు. ఆమె ప్రవర్తన వ‌ల్ల‌ సెట్ లో చాలామంది ఇబ్బంది పడ్డారు అని వెల్లడించారు. అయితే ఇప్పటివరకు నాగశౌర్య చేసిన కామెంట్ పై సాయి పల్లవి స్పందించలేదు. ఈ విషయం జరిగి దాదాపు మూడేళ్లు పూర్తి అయ్యింది. కానీ తాజాగా ఈ విషయంపై సాయి పల్లవి స్పందించింది.

అంతేకాకుండా కణం సినిమా దర్శకుడు ఎ.ఎల్.విజయ్ కెమెరామెన్ నిరవ్ షా లకు ఫోన్ చేసి… సెట్ లో నా వల్ల ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా.. అంటూ ప్రశ్నించింది. దానికి వాళ్లు అలాంటిది ఏమీ లేదు అంటూ సమాధానమిచ్చారు. అనంతరం సాయి పల్లవి మాట్లాడుతూ… నాగశౌర్య అంటే తనకు గౌరవం ఉందని ఆయన నాలో న‌చ్చ‌ని గుణం గురించి బయటకు చెప్పారు అని పేర్కొంది. దాన్ని నేను పాజిటివ్ గానే తీసుకున్నా…. నిజంగా సెట్లో నావల్ల నీకు ఇబ్బంది కలిగింది అంటే బాధగా ఉంది.

SAIPALLAVI

నా సమాధానంతో ఇప్పుడు అయినా ఆయన సంతృప్తి చెందుతారని ఆశిస్తున్నా అంటూ సాయిపల్లవి పేర్కొంది. ఇదిలా ఉంటే సాయిపల్లవి ప్రస్తుతం వరుస ఆఫర్ల‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా శ్యాం సింగరాయ్ అనే సినిమాతో సాయి పల్లవి సూపర్ డూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా కంటే ముందు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ సినిమా కూడా ప్రేక్షకులను అలరించింది.

Visitors Are Also Reading