Home » సిద్దార్థ్ కామెంట్లతో మా కుటుంబం డిస్టబ్ అయ్యింది… భయటకు వచ్చి స్వారీ చెప్పాలి : సైనా నెహ్వాల్ తండ్రి డిమాండ్

సిద్దార్థ్ కామెంట్లతో మా కుటుంబం డిస్టబ్ అయ్యింది… భయటకు వచ్చి స్వారీ చెప్పాలి : సైనా నెహ్వాల్ తండ్రి డిమాండ్

by AJAY
Ad

సినీ నటుడు సిద్ధార్థ్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పై డబుల్ మీనింగ్ వచ్చేలా అసభ్య పదజాలంతో ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. పంజాబ్ లో ప్రధాని మోడీ కాన్వాయ్ ని కొందరు నిరసనకారులు అడ్డుకున్న అంశంపై సైనా నెహ్వాల్ ట్వీట్ చేయగా…..ఆ ట్వీట్ కు రిప్లై ఇస్తూ సిద్ధార్థ్ డబల్ మీనింగ్ తో అసభ్య పదజాలం వాడుతూ కామెంట్ చేశారు. దాంతో సిద్దార్థ్ పై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే జాతీయ మహిళా కమిషన్ సిద్ధార్థ్ పై ఫిర్యాదు చేసింది. సిద్ధార్థ్ అనేకసార్లు మహిళలపై అసభ్య పదజాలం వాడారని అతడి పై చర్యలు తీసుకోవాలని నేషనల్ కౌన్సిల్ ఫర్ ఉమెన్స్( జాతీయ మహిళా కమిషన్ ) తమిళనాడు డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Siddarth Saina Nehwal

Siddarth Saina Nehwal

ఈ విషయాన్ని మహిళా జాతీయ మహిళా చైర్ పర్సన్ రేఖ శర్మ వెల్లడించారు. ఇదిలా ఉండగా సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలను సైనా నెహ్వాల్ తండ్రి హర్విర్ నెహ్వాల్ తీవ్రంగా ఖండించారు. “ఓ సినిమా నటుడు సైనా నెహ్వాల్ పై బ్యాడ్ కామెంట్లు చేశాడు. అతడు చేసిన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అతడు బయటకు వచ్చి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను.. మా కుటుంబం సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలతో చాలా డిస్టర్బ్ అయింది.

Advertisement

Also read : అక్కా ఇలాంటి ఫోటోలు పెట్టి వ్యాల్యూ తీసుకోకండి… శివజ్యోతి ఫోటో పై నెటిజన్ల కామెంట్స్…!

సైనా నెహ్వాల్ ఈ విషయంపై ఎంతో బాధపడుతుంది.” అంటూ చెప్పుకొచ్చారు. ఇక సిద్దార్థ్ చేసిన వ్యాఖ్యలను పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇప్పటికే సిద్దార్థ్ చేసిన వ్యాఖ్యలపై సింగర్ చిన్మయి మండిపడింది. అదేవిధంగా నటి మరియు బిజెపి నాయకురాలు కుష్బూ సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. అదేవిధంగా నెటిజన్లు సైతం సిద్ధార్థ్ మెంటల్ స్టేటస్ సరిగా లేదని అతడు ఆసుపత్రిలో చూపించుకోవాలని కామెంట్లు పెడుతున్నారు. అతడు బయటకు వచ్చి క్షమాపణలు చెప్పాలని కోరుతున్నారు.

Visitors Are Also Reading