Home » హౌలేగాళ్ల‌ను హీరోను చేశారు అంటూ బ‌న్నీపై టీఆర్ఎస్ నేత సంచ‌ల‌న వ్యాఖ్యలు….!

హౌలేగాళ్ల‌ను హీరోను చేశారు అంటూ బ‌న్నీపై టీఆర్ఎస్ నేత సంచ‌ల‌న వ్యాఖ్యలు….!

by AJAY

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ బ్లాక్ బస్టర్ సినిమా పుష్ప. ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప మేనియానే కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా పుష్ప క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించగా అల్లు అర్జున్ కు హీరోయిన్ గా రష్మిక మందన న‌టిచింది. ఈ సినిమాలో అనసూయ, సునీల్ కీలక పాత్రల‌లో నటించారు. ఈ సినిమాకు సమంత స్పెషల్ సాంగ్ మరో అట్రాక్షన్ గా నిలిచింది. ఇక సినిమాలోని డైలాగులు ట్రైలర్ విడుదలైన నాటి నుండి ఎంతో ఫేమస్ అవుతున్న సంగతి తెలిసిందే.

sai chand on pushpa

sai chand on pushpa

ఈ చిత్రంలో డైలాగులకు మన దేశంలోని క్రికెటర్లు మాత్రమే కాకుండా విదేశాల్లోని క్రికెటర్లు సైతం వీడియోలు చేస్తున్నారు. అంతే పుష్ప క్రేజ్ ఎక్క‌డ వ‌ర‌కూ వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సినిమా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెర‌కెక్కిన‌ సంగతి తెలిసిందే. సినిమాలో బన్నీ స్మ‌గ్ల‌ర్ గా కనిపించాడు. దాంతో ఈ సినిమాపై కొంతమంది విమర్శకులు కురిపిస్తున్నారు.

ALSO READ : “అక్క‌డ షేవ్ చేసుకోలేదా” అంటూ నెటిజ‌న్ గ‌లీజ్ ప్రశ్న‌…ఇచ్చిప‌డేసిన చిట్టి..!

రీసెంట్ గా పద్మశ్రీ గరికపాటి నరసింహారావు స్మగ్లర్ హీరో కావ‌డం ఏంటి అంటూ విమర్శలు కురిపించారు. ఇప్పుడు తాజాగా టిఆర్ఎస్ నాయకుడు ప్రముఖ ఫోక్ సింగర్ సాయి చంద్ కూడా పుష్ప సినిమా పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఓ సభలో పిల్లలను సైలెంట్ గా ఉండాలి అని చెబుతూ మీరు ఏమైనా పుష్ప అనుకుంటున్నారా… హౌలేగాళ్ల‌ను తగ్గేదే లేదు అంటూ హీరోలు చేసిన‌త‌ర్వాత పిల్లలను కంట్రోల్ చేయడం కష్టమైందని వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమాను తీసిన‌ ఎదవలను చెప్పుతో కొట్టాలి అంటూ సంచలన కామెంట్లు చేశాడు. దాంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ మరియు సినీ ప్రియులు సాయి చంద్ పై ఫైర్ అవుతున్నారు. పబ్లిసిటీ కోసమే ఇలాంటి మాటలు మాట్లాడాడు అంటూ మండిపడుతున్నారు.

Visitors Are Also Reading