Home » మంచు విష్ణు సినిమా నుంచి సాయి ప‌ల్లవి త‌ప్పుకోవ‌డానికి కార‌ణం ఏమిటో తెలుసా..?

మంచు విష్ణు సినిమా నుంచి సాయి ప‌ల్లవి త‌ప్పుకోవ‌డానికి కార‌ణం ఏమిటో తెలుసా..?

by Anji
Ad

మోహ‌న్‌బాబు త‌న‌యుడు మా అధ్య‌క్షుడు, న‌టుడు, నిర్మాత‌ మంచు విష్ణు ఓ కామెడి ఎంట‌ర్‌టైన్‌మెంట్ సినిమాలో న‌టిస్తున్నాడు. ఇందులో బోల్డ్ బ్యూటి పాయ‌ల్ రాజ్‌పుత్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోంది. ‘గాలి నాగేశ్వ‌ర‌రావు’ అనే టైటిల్ తో ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టి స‌న్నిలియోన్ కూడా కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంది.

Advertisement

పాయ‌ల్ రాజ్ పుత్‌ను ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకునే ముందు విష్ణు మ‌హిళా క‌థానాయిక‌గా న‌టించ‌డానికి స్టార్ న‌టి సాయి ప‌ల్ల‌విని సంప్ర‌దించిన‌ట్టు స‌మాచారం. అయితే ఫిదాతో ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసిన ఈ న‌టి ఈ సినిమా కోసం రూ.2.5 కోట్లు డిమాండ్ చేసిన‌ట్టు తెలుస్తోంది. మేక‌ర్స్ అంత చెల్లించ‌డానికి ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌డంతో ఈ న‌టి ఆఫ‌ర్‌ను తిర‌స్క‌రించిన‌ట్టు స‌మాచారం. ఆ త‌రువాత మా అధ్య‌క్షుడు మంచు విష్ణు పాయెల్‌కు అవ‌కాశం ఇచ్చాడు.

Advertisement

తాజా స‌మాచారం మేర‌కు ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ అత్యంత త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్న‌ట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి ఈషాన్ సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గాలి నాగేశ్వ‌ర‌రావు స్క్రిప్ట్‌ను జి నాగేశ్వ‌ర్ రెడ్డి రాశారు. లెన్స్ వెనుక సినిమాటోగ్రాఫ‌ర్ ఛోటా కె నాయుడు అనూప్ రూబెన్స్ సంగీతం స‌మ‌కూర్చనున్నారు.

Also Read :  నిరాశ‌లో ఓటీటీ అభిమానులు.. ఎందుకంటే..?

Visitors Are Also Reading