Home » విజయ్ దేవరకొండకి జోడీగా సాయిపల్లవి.. కానీ ఆ సినిమా ఎలా మిస్ అయిందంటే ?

విజయ్ దేవరకొండకి జోడీగా సాయిపల్లవి.. కానీ ఆ సినిమా ఎలా మిస్ అయిందంటే ?

by Anji
Ad

టాలీవుడ్ యంగ్ హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు. అర్జున్ రెడ్డి మూవీతో టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక బేస్ క్రియేట్ చేసుకున్నారు విజయ్. ఇటీవల విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన లైగర్ మూవీ ఫ్లాప్ తరువాత ప్రస్తుతం ఖుషి సినిమా చీత్రీకరణలో చాలా బిజీగా ఉన్నారు. ఈ మూవీలో సమంత కథానాయికగా నటిస్తోంది. దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ, రష్మిక జోడికి అభిమానులు చాలా ఎక్కువగానే ఉన్నారు. గీతా గోవిందం తరువాత వీరు కలిసి నటించిన సినిమా డియర్ కామ్రెడ్. ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయింది. 

Advertisement

ముఖ్యంగా ఈ మూవీ థియేటర్లలో వసూళ్లను సాధించలేకపోయినప్పటికీ విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఈ మూవీలో హీరోయిన్ లిల్లీ పాత్రకు ఫస్ట్ ఛాయిస్ రష్మిక కాదనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. తాజాగా ఫిలిం సర్కిల్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాకి రష్మిక పోషించిన లిల్లీ పాత్రకు న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవికి ఫస్ట్ ఎంపిక చేశారట. కొన్ని అనివార్య కారణాల వల్ల సాయి పల్లవి ఈ సినిమాను వదులుకుందట. 

Advertisement

ఇక ఆ తరువాత ఈ ఆఫర్ రష్మికకు వచ్చిందట. డియర్ కామ్రేడ్ మాత్రమే కాదు.. అజిత్ కుమార్ నటించిన తునివు,విజయ్ దళపతి నటిస్తున్న లియో సినిమాలకు సాయి పల్లవిని సంప్రదించగా.. ఆమె రిజెక్ట్ చేసిందట. ప్రస్తుతం సాయిపల్లవి తమిళ హీర శివ కార్తికేయన్ కి జోడీగా నటిస్తోంది. ఈ మూవీని కమల్ హాసన్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలిమ్స్ బ్యానర్ నిర్మిస్తోంది. మొదటిసారిగా  శివ కార్తికేయన్ తో కలిసి నటిస్తోంది సాయిపల్లవి. దీంతో ఈ సినిమాపై ఆసక్తి ఏర్పడింది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

పవిత్ర పిల్లల్ని కంటే తప్పేముంది అంటున్న నరేష్..!!

Jr. NTR పెళ్లికి ముందే ఆ హీరోయిన్ ని పిచ్చిగా ప్రేమించారా.. కానీ..?

భార్య భర్తకు ఎడమవైపు పడుకుంటే ఇంత అదృష్టమా..?

Visitors Are Also Reading