Home » నిర్మాతగా మారనున్న సాయి పల్లవి…?

నిర్మాతగా మారనున్న సాయి పల్లవి…?

by Azhar
Ad
ప్రస్తుతం తెలుగులో సాయి పల్లవి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. చేసినవి కొన్ని సినిమాలే అయిన కూడా.. సాయి పల్లవికి ఫ్యాన్ ఫాలోయింగ్ క్రేజ్ అనేది విపరీతంగా వచ్చింది. ఇక ఆమె తీసుకునే నిర్ణయాలు.. సినిమాల పట్ల ఆమెకు ఉండే కమిట్మెంట్ అనేది అభిమానులకు బాగా నచ్చుతుంది. అదే విధంగా పైసల కోసం కాకుండా పని సంతృప్తి కోసం సాయి పల్లవి పని చేస్తుంది. అందుకే ఏ వచ్చిన ఒకే చెప్పకుండా.. తనకు తగిన సినిమాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ అనేది ఇస్తుంది.
అయితే సినిమా విడుదల అయిన తర్వాత దాని ఫలితంతో సంబంధం లేకుండా.. తన నటనతో మార్కులు కొట్టేయడంలో సాయి పల్లవి ముందుటుంది. ఈ విషయం ఇప్పటికే ఆమె నిరూపించుకుంది. తాజాగా సాయి పల్లవి నటించిన విరాటపార్వం అనే సినిమా హిట్ కాకపోయినా.. ఇందులో సాయి పల్లవి నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి అనేది నిజం. ఇక ఇప్పుడు సాయి పల్లవి ముఖ్య పాత్రలో మరి సినిమా వస్తుంది. అదే గార్గి. ఈ సినిమా మొత్తం సాయి పల్లవి చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఈ నెల 15న ఈ సినిమా అనేది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ క్రమంలో గార్గి సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో ఇప్పుడు బిజీగా గడుపుతుంది సాయి పల్లవి. అందులో భాగంగా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ.. నాకు నచ్చిన కథ వస్తే అందులో నటించడమే కాదు.. నేను నిర్మాతగా కూడా మారుతాను అని సాయి పల్లవి స్పష్టం చేసింది. అయితే ఈ మధ్య హీరోలు తమ సినిమాలు తామే నిర్మించుకుంటుంటే.. ఇప్పుడు సాయి పల్లవి కూడా సినిమాలు నిర్మించడానికి సిద్ధం అంటుంది. కానీ తాను నిర్మాతగా మారడానికి ఇంకా కొద్దిగా సమయం ఉంది అని సాయి పల్లవి పేర్కొంది. చూడాలి మరి సాయి పల్లవి తన ప్రొడక్షన్ హౌస్ ఎప్పుడు ఓపెన్ చేస్తుంది అనేది.

Advertisement

Visitors Are Also Reading