డాన్సర్ గా కెరీర్ మొదలుపెట్టి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటి సాయి పల్లవి. మలయాళ సినిమా ప్రేమమ్ తో సాయి పల్లవి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో మలర్ అనే పాత్రలో నటించి ఆకట్టుకుంది. సినిమాలో లెక్చరర్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా భారీ విజయం సాధించింది. కేవలం మలయాళ ప్రేక్షకులనే కాకుండా టాలీవుడ్ ఇతర ఇండస్ట్రీలోని ప్రేక్షకులను సైతం ప్రేమమ్ సినిమా ఆకర్షించింది.
Advertisement
దాంతో సాయిపల్లవి క్రేజ్ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి ఫిదా సినిమా తో ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ సినిమా తర్వాత వరుస ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయి. టాలీవుడ్ స్టార్ హీరోల సరసన సాయి పల్లవి సినిమాలు చేస్తోంది. అంతేకాకుండా గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ కేవలం తన పాత్రకి ప్రాధాన్యత ఉన్న సినిమాల్లోనే సాయి పల్లవి నటిస్తోంది.
Advertisement
రీసెంట్ గా శ్యామ్ సింగరాయ్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. అయితే కొంతకాలంగా సాయిపల్లవి సినిమాలకు గ్యాప్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. దానికి కారణం శ్యామ్ సింగరాయ్ తరవాత సాయి పల్లవి మళ్లీ ఏ సినిమాకు ఒప్పుకోలేదు. దాంతో కొంతకాలం సాయి పల్లవి బ్రేక్ తీసుకుంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా సాయిపల్లవి ప్రేమమ్ సినిమాతో పాపులారిటీ సంపాదించుకోగా అంతకముందే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఓ తమిళ సినిమాలో నటిచింది. కాన ఈ విషయం చాలా మందికి తెలియదు. కంగనా రనౌత్ ముఖ్యపాత్రలో నటిచిన తమిళ సినిమా దామ్ దూమ్ లో సాయిపల్లవి కనిపిస్తుంది. ఇక ఈ సినిమా చేసిన సమయంలో సాయిపల్లవి వయసు కేవలం ఆరేళ్లనట. అంతే కాకుండా ఓ ఇంటర్వ్యూలో సాయిపల్లవి మాట్లాడుతూ అది తన డెబ్యూ సినిమా అని అంగీకరించను అని చెప్పింది. ఏదో టైమ్ పాస్ కోసం ఆ సినిమా షూటింగ్ కు వెళ్లానని చెప్పింది.