Home » బ‌ల‌వంత‌పు బంధుత్వాల క‌న్నా ఒంటరిత‌నమే బెట‌ర్ అంటూ స‌దా ఎమోష‌న‌ల్ పోస్ట్…నెట్టింట వైర‌ల్..!

బ‌ల‌వంత‌పు బంధుత్వాల క‌న్నా ఒంటరిత‌నమే బెట‌ర్ అంటూ స‌దా ఎమోష‌న‌ల్ పోస్ట్…నెట్టింట వైర‌ల్..!

by AJAY

నితిన్ హీరోగా న‌టించిన జ‌యం సినిమాతో టాలీవుడ్ కు ప‌రిచ‌యం అయిన బ్యూటీ స‌దా. మొద‌టి సినిమాతోనే స‌దా అభిమానుల‌ను సంపాదించుకుంది. అందం అభిన‌యంతో స‌దా ప్రేక్షుల‌ను ఫిదా చేసింది. జ‌యం సినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో ఆ త‌ర‌వాత వ‌రుస ఆఫ‌ర్ లు అందుకుంది. అప‌రిచితుడు లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలోనూ న‌టించి త‌మిళ్ లో సైతం వ‌రుస ఆఫ‌ర్ లను అందుకుంది.

చాలా కాలం పాటూ తెలుగుతో పాటూ త‌మిళ్ లో స్టార్ హీరోయిన్ గా రానించిన సదా ఆ త‌ర‌వాత అవ‌కాశాలు త‌గ్గుముఖం ప‌ట్టండంతో సినిమాల‌కు దూరం అయ్యింది. సినిమాల‌కు దూరం అయ్యినా ప్ర‌స్తుతం బుల్లితెర‌పై సంద‌డి చేస్తోంది. ఢీ షోకు జ‌డ్జిగా చేసి బుల్లితెర‌పై కూడా త‌న దైన ముద్ర వేసుకుంది. రీసెంట్ గా స‌దా ఓ వెబ్ సిరీస్ లోనూ న‌టించింది. ఇదిలా ఉండ‌గా స‌దా తాజాగా సోష‌ల్ మీడియాలో ఓ ఎమోష‌న‌ల్ పోస్ట్ చేసింది.

త‌న పోస్ట్ లో….చాలా మంది త‌మ మ‌న‌సుకు న‌చ్చిన‌వారిని ఎక్క‌డో కోల్పోతారని భ‌య‌పెడుతూనే ఉంటారు. కానీ కొన్నిసార్లు మ‌న‌సుకు న‌చ్చిన‌వాళ్లే మోసం చేస్తుంటారు. అలాంటి వారితో ఉన్నామంటే మ‌న‌ల్ని మ‌నం ప్ర‌మాదంలోకి నెట్టేసుకున్న‌ట్టే…ఒక‌రికోసం మీరు ఎన్ని త్యాగాలు చేసినా ఆ త్యాగాల‌కు గుర్తింపు లేక‌పోతే అర్థం లేదు.

ఎందుకంటే మ‌న‌తో పాటూ చివ‌రి వ‌ర‌కూ ఉండేది అంత‌రాత్మ మాత్ర‌మే. జీవితంలోకి ఎంతోమంది వ‌స్తుంటారు పోతుంటారు…కానీ చివ‌రి వ‌ర‌కూ నీకు నువ్వు మాత్ర‌మే తోడుంటావు. అలాంటి బంధుత్వాల‌లో చిక్కుకోవ‌డం కంటే ఒంట‌రిత‌న‌మే మంచిది అంటూ స‌దా త‌న పోస్ట్ లో పేర్కొంది. ప్ర‌స్తుతం స‌దా చేసిన పోస్ట్ నెట్టింట వైర‌ల్ అవుతోంది.

Visitors Are Also Reading