Home » సంజూపై సచిన్ కామెంట్స్.. అలా చేస్తాడు అని నేను అనుకోలేదు..!

సంజూపై సచిన్ కామెంట్స్.. అలా చేస్తాడు అని నేను అనుకోలేదు..!

by Azhar
Ad
ఐపీఎల్ 2022 సీజన్ ఫైనల్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్ కెప్టెన్ సంజూ శాంసన్ చేసిన పని పై భారీగా విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో టాస్ గెలిచిన కెప్టెన్ లలో నూటికి తొంబై శాతం బౌలింగ్ నే తీసుకున్నారు. కానీ ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచిన సంజూ మాత్రం బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ నిర్ణయం పై చాలా మంది అభిమానులు క్రికెట్ ప్రముఖులు ఆశ్చర్యం వ్యక్తం చేసారు. ఇక ఇప్పుడు ఆ లిస్ట్ లో భారత దిగ్గజ ఆటగాడి సచిన్ టెండూల్కర్ కూడా చేరిపోయాడు.
తాజాగా సచిన్ మాట్లాడుతూ… ఫైనల్స్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ బ్యాటింగ్ ఎంచుకుంటాడు అని నేను అనుకోలేదు. అది నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే అంతక ముందు క్వాలిఫైర్ 2 లో ఇదే పిచ్ పై మొదట బౌలింగ్ చేసిన రాజస్థాన్ బెంగళూర్ జట్టు పై మంచి విజయాన్ని అందుకుంది. అంతే కాకుండా ఈ సీజన్ మొత్తంలో కుశ రాజస్థాన్ మొదట బౌలింగ్ చేసిన మ్యాచ్ లలోనే విజయాలు సాధించాయి.
అయిన కూడా ఈ మ్యాచ్‌లో వారు బ్యాటింగ్ ఎందుకు ఎంచుకున్నారో నాకు అర్ధం కావడం లేదు. ఒకవేళ వాటి ఫైనల్స్ కాబట్టి మొదట బ్యాటింగ్ చేయాలనీ అనుకోని ఉంటారు. కానీ ఈ పిచ్ పై గుజరాత్ కు అనుభవం లేదు… రాజస్థాన్‌కు ఒక మ్యాచ్ ఆడిన అనుభవం ఉంది. కాబట్టి నా ఉదేశ్యంలో రాజస్థాన్ మొదటి బౌలింగ్ చేసుంటే బాగుండేది. బెంగళూర్ పైబట్లర్ సెంచరీ చేశాడు కదా.. అదే ఫామ్ ను అతను కొనసాగించాలని ఆ జట్టు అనుకోని ఉంటుంది అని సచిన్ అన్నాడు. అయితే సంజూ తీసుకున్న ఈ నిర్ణయం వల్లే ఈ ఫైనల్స్ లో ఫిక్సింగ్ జరిగింది అంటూ అభిమానులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Visitors Are Also Reading