Home » మళ్లీ విరుచుకుపడుతున్న రష్యా..!

మళ్లీ విరుచుకుపడుతున్న రష్యా..!

by Anji
Ad

ఉక్రెయిన్ పై రష్యా మరోసారి భీకర యుద్ధం చేస్తోంది. రెండు దేశాల మధ్య యుద్ధం 44వ రోజుకు చేరుకుంది. మళ్లీ రాకెట్ దాడులతో విరుచుకుపడుతోంది. బాంబులు, క్షిపణులు, రాకెట్ దాడులతో ఉక్రెయిన్ లోకి పలు ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి. కీవ్ నుంచి పుతిన్ సేనలు నిష్క్రమించినప్పటికీ మిగతా చోట్ల విధ్వంసక చర్యలు కొనసాగిస్తూ ప్రాణాల్ని బలితీసుకుంటున్నాయి.

Advertisement

తాజాగా తూర్పు ఉక్రెయిన్ లోకి డొనేట్స్ ప్రాంతం క్రమటోర్క్స్ రైల్వే స్టేషన్ పై జరిగిన మిస్సైల్ దాడుల్లో కనీసం 35 మంది మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు. మిస్సైల్ దాడులతో రైల్వే స్టేషన్ జనం హాహాకారాలు, ఆర్తనాదాలతో దద్దరిల్లింది. మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. రష్యా_ ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతుండడంతో సురక్షిత ప్రాంతాలకు జనాన్ని తరలిస్తున్న సమయంలో ఈ స్టేషన్ లో దాడులు జరగడంతో భారీగా ప్రాణ నష్టం సంభవించింది. మరోవైపు ఖర్కివ్ ప్రాంతం రష్యా బలగాల కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది.

Advertisement


24 గంటల వ్యవధిలో 48 సార్లు కాల్పులు జరిగాయి. రష్యా బలగాలనివాస ప్రాంతాలపై దాడి చేసేందుకు ఫిరంగిలు, యుద్ధ ట్యాంకులు, బహుళ ప్రయోగ రాకెట్ వ్యవస్థను ఉపయోగిస్తున్నాయి. అటు రష్యా దూకుడును ఉక్రెయిన్ బలగాలు ధీటుగా ఎదుర్కొంటోంది. శత్రుసేనల్ని కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. ఉక్రెయిన్ రష్యా దండయాత్ర మొదలైనప్పటి నుంచి 19 వేల మందికి పైగా సైనికుల్ని చంపినట్టు ఉక్రెయిన్ రక్షణ శాఖ ప్రకటించింది. 150 విమానాలు, 135 హెలికాప్టర్లు, 700 ట్యాంకులు, 1891 సాయుధ శకటాల తో పాటు భారీగా యుద్ధ సామాగ్రిని ధ్వంసం చేసినట్టు వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ నుంచి బహిష్కరించినప్పటికీ రష్యా దూకుడు తగ్గడం లేదు. రష్యా దళాల దాడుల తర్వాత అనేక ఉక్రెయిన్ నగరాల్లో భవనాలు, రోడ్లు, రవాణా వ్యవస్థ పూర్తిస్థాయిలో ధ్వంసమయ్యాయి. సాధారణ పౌరుల మరణాల కేసులు కూడా నిరంతరం పెరుగుతున్నాయి. ఉక్రెయిన్ లో సామాన్య పౌరులపై జరుగుతున్న దాడులపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి

Visitors Are Also Reading