Home » రోజా కూతురి ఫొటోలు మార్ఫింగ్.. కన్నీరు పెట్టుకున్న నటి

రోజా కూతురి ఫొటోలు మార్ఫింగ్.. కన్నీరు పెట్టుకున్న నటి

by Bunty
Ad

అలనాటి హీరోయిన్‌, ప్రస్తుత రాజకీయ నాయకురాలు రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మధ్యంతరం హీరోయిన్లలో రోజా కూడా ఒకరు. ఆమె ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా మారింది. అలాంటి రోజా ఇండస్ట్రీలో ఎంత పేరు సంపాదించిందో అంత మంచి మనసు కలిగిన నటి అని చెప్పవచ్చు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మనస్తత్వం ఈమె సొంతం. ఇప్పటికే ఎన్నో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా మారినా, బుల్లితెర షోల ద్వారా మరింత క్రేజ్ తెచ్చుకుంది.

Advertisement

ప్రస్తుతం రోజా వైఎస్ఆర్ ప్రభుత్వంలో మంత్రి పదవి రావడంతో సినిమాలకు మరియు బుల్లితెర షోలకు ఫుల్ స్టాప్ పెట్టి ప్రజాసేవలో ముందుకు పోతోంది. అయితే, మంత్రి రోజ ఇటీవల ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో సినిమాలు, రాజకీయాల పరంగా తాను ఎదుర్కొంటున్న ఒడిదుడుకులను పంచుకున్నారు. ముఖ్యంగా తనపై, తన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియా వేదికగా కొందరు చేస్తున్న ట్రోల్స్ గురించి చెప్పి ఎమోషనల్ అయ్యారు.

Advertisement

‘నా కూతురు అన్షు మాలిక చాలా సెన్సిటివ్. తనది చాలా మృదుస్వభావం. అలాంటిది సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు తన కూతురు ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన పోస్టులు చేశారు. వాటిని చూసి నా కుమార్తె చాలా బాధపడింది. ఇలాంటివన్నీ మనకు అవసరమా అంటూ మొహం మీద నన్ను ప్రశ్నించింది. అలాగే నా సోదరుడు గురించి కూడా అభ్యంతరకరంగా మాట్లాడారు. అయితే సెలబ్రిటీలకు ఇలాంటివన్నీ సర్వసాధారణమని నా పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాను’ అని భావోద్వేగానికి గురైంది రోజా. కాగా ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌ గా మారిపోయాయి.

READ ALSO :  తెలంగాణ పోలీస్ ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్.. వాళ్లకు ఈవెంట్స్‌ లేవు.. డైరెక్ట్‌గా మెయిన్సే

Visitors Are Also Reading