Home » IND VS SL : రోహిత్ శర్మ ఇంట తీవ్ర విషాదం..

IND VS SL : రోహిత్ శర్మ ఇంట తీవ్ర విషాదం..

by Bunty
Ad

IND VS SL : టీ 20 సిరీస్‌ గెలిచిన టీమిండియా వన్డేల్లోనూ శుభారంభం చేసింది. గౌహతి వేదికగా మంగళవారం జరిగిన తొలి వన్డేలో భారత క్రికెట్ జట్టు 67 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ లో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమ్ ఇండియా 1-0 ఆదిక్యంలో నిలిచింది. అయితే, ఈ తొలి వన్డేలో భారత సారధి రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ తో రాణించిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ టూర్ లో గాయపడి రోహిత్ కొన్ని రోజుల విశ్రాంతి అనంతరం ఈ మ్యాచ్ ఆడుతున్నాడు.

Advertisement

41 బంతుల్లో హఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న హిట్ మ్యాన్ మొత్తంగా 67 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ ప్రారంభం నుంచి దాటిగా ఆడిన రోహిత్ తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. మధుశంక బౌలింగ్ లో బంతి ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకోవడంతో రోహిత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే ఈ మ్యాచ్ లో రోహిత్ ఆఫ్ సెంచరీ పూర్తి చేశాక, ఆకాశం వైపు చూస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు. అందుకు కారణం వారి ఇంట విషాదం నెలకొనడమే. హాఫ్ సెంచరీ మార్క్ చేరుకోగా రోహిత్ ఆకాశం వైపు చూస్తూ మ్యాజిక్ అన్నాడు.

మ్యాజిక్ అనేది అతని పెంపుడు కుక్క పేరు. ఈ అర్థ శతకాన్ని రోహిత్ తమ పెంపుడు కుక్కకు అంకితం చేశాడని నెటిజన్లు చెబుతున్నారు. తమ పెంపుడు శునకం మ్యాజిక్ నిన్న చనిపోయిందని రోహిత్ భార్య రితిక ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వెల్లడించింది. తన పెద్ద బిడ్డను కోల్పోయినంత బాధగా ఉందంటూ ఆమె బాగోద్వేగానికి లోనైంది. ఆమె చేసిన పోస్ట్ పై సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ ప్రేయసి అతియా శెట్టి, ముంబై ఇండియన్స్ యువ ఆటగాడు తిలక్ వర్మ మొదలైన వారు స్పందించారు. ఈ నేపథ్యంలోనే రోహిత్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాక ఆకాశం వైపు చూస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు.

READ ALSO : శ్రీలంక మ్యాచ్‌లో హైడ్రామా.. క్రీడా స్పూర్తిని చాటుకున్న రోహిత్ శర్మ

Visitors Are Also Reading