Home » గాయంపై రోహిత్ క్లారిటీ..!

గాయంపై రోహిత్ క్లారిటీ..!

by Azhar
Ad

భారత జట్టుకు ప్రస్తుతం మూడు ఫార్మట్స్ లో కెప్టెన్ గా రోహిత్ శర్మ వ్యవరిస్తున్నాడు. కెప్టెన్ అంటే జట్టుకు ప్రతి మ్యాచ్ లోను అందుబాటులో ఉండాలి. ఆ లెవల్ లో ఫిట్నెస్ అనేది మెంటేన్ చేయాలి. కానీ ఇప్పుడు ఉన్న రోహిత్ ఫిట్నెస్ గురించి అందరికి తెలిసిందే. ఒక్క సిరీస్ ఆడితే మరొక సిరీస్ లో గాయపడుతుంటాడు. ఇలా రోహిత్ గాయాల కారణంగానే ఈ ఏడాది టీం ఇండియా చాల మంది కెప్టెన్లను మార్చింది.

Advertisement

ఇక ఇప్పుడు విండీస్ లో ఉన్న టీం ఇండియాకు వన్డే సిరీస్ లో అందుబాటులో లేని రోహిత్ టీ20 సిరీస్ కు జట్టులోకి వచ్చి కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇక ఈ 5 టీ20ల సిరీస్ లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్ లో రోహిత్ మళ్ళీ గాయపడ్డాడు. ఈ సిక్స్ కొట్టే క్రమంలో రోహిత్ కు వెన్నులో నొప్పి అనేది రావడంతో రిటైడ్ హార్ట్ గా పెవిలియన్ చేరాడు. అందువల్ల రోహిత్ ఈ సిరీస్ కు మిస్ అని అందరూ అనుకున్నారు.

Advertisement

అయితే తాజాగా రోహిత్ తన గాయంపై స్పందించాడు. ఇప్పుడు నాకు పర్లేదు. తర్వాతి మ్యాచ్ కు ఇంకా చాలా సమయం అనేది ఉంది. కాబట్టి అప్పటి వరకు నేను మళ్ళీ సెట్ అవుతాను… ఆడుతాను అని పేర్కొన్నాడు. అయితే టీం ఇండియా నాల్గవ టీ20 అనేది ఈ నెల 6న ఉంది. కానీ ఈ మ్యాచ్ వరకు రోహిత్ నిజంగా జట్టులోకి అందుబాటులోకి వస్తాడా లేదా అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి :

ఇక మౌకా మౌకా యాడ్‌ కనిపించదట..!

9 ఏళ్ళ తర్వాత అమ్మను కలిసిన ముంబై ఆటగాడు..!

Visitors Are Also Reading