Home » ముంబై జట్టులో ఉంటె సూర్య కెరియర్ నాశనం..!

ముంబై జట్టులో ఉంటె సూర్య కెరియర్ నాశనం..!

by Azhar
Ad

ప్రస్తుతం భారత జట్టు బ్యాటర్లలో నిలకడగా రాణిస్తున్న ఆటగాడు సూర్య కుమార్ యాదవ్. తిరువనంతపురంలో సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో రోహిత్, కోహ్లీ, రాహుల్ ఇలా అందరూ ఆటగాళ్లు ఇబ్బంది పడిన సూర్య కుమార్ యాదవ్ మాత్రం రెచ్చిపోయాడు. అందువల్ల అతనిపై ప్రశంసలు అనేవి పెరిగాయి. ఈ క్రమంలో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్.. సూర్య కుమార్ యాదవ్ పై కొన్ని కామెంట్స్ చేసాడు.

Advertisement

పాంటింగ్ మాట్లాడుతూ.. నేను ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు ఆడుతున్న సమయంలో సూర్య కుమార్ యాదవ్ ఒక్క చిన్న కుర్రడు. కానీ అప్పుడు అతను తుది జట్టులోకి రాలేదు. కానీ ఆ ఆతర్వాత సూర్య కుమార్ యాదవ్ కేకేఆర్ జట్టులోకి వెళ్ళాడు. అక్కడ అతనికి అవకాశాలు అనేవి వచ్చాయి. వాటితో తన సామర్ధ్యాని అతను నిరూపించుకున్నాడు. తనలోని ఆటను మొత్తం బయట పెట్టాడు.

Advertisement

ఒకవేళ సూర్య కుమార్ యాదవ్ అలానే ముంబై జట్టులోని ఉంటె అతడికి అవకాశాలు వచ్చేవి కావు. అందుకు కారణం అప్పుడు ముంబై జట్టులో అందరూ గొప్ప ఆటగాళ్లు ఉన్నారు. అయితే ఎంత గొప్ప ఆటగాడిని వదులుకున్నం అని తెలుసుకున్న ముంబై ఇప్పుడు మళ్ళీ అతడిని తన జట్టులోనే ఉండేలా చూసుకుంటుంది. కానీ నేను మాత్రం అప్పుడే సూర్య కుమార్ యాదవ్ లో ఎంతో టాలెంట్ ఉంది అనే విషయాన్ని తెలుసుకున్నాను అని రికీ పాంటింగ్ పేర్కొనాడు.

ఇవి కూడా చదవండి :

ఐపీఎల్ కంటే తక్కువగా ప్రపంచ కప్ ప్రైజ్‌మనీ..!

ప్రపంచ కప్ లో హైదరాబాదీ పేసర్ కు అవకాశం..!

Visitors Are Also Reading