పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం భీమ్లా నాయక్. ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రానా కూడా ముక్యమైన పాత్రలో నటించారు. ఇక ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ కు జోడీగా నిత్యామీనన్ నటించగా రానాకు జోడీగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను ఫిబ్రవరి 25న చిత్ర యూనిట్ విడుదల చేస్తామని ప్రకటించింది.
Advertisement
అంతే కాకుండా ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పవన్ కల్యాణ్ పై మరియు భీమ్లా నాయక్ సినిమాపై వ్యంగ్యాస్త్రాలు కురిపిస్తూ వరుస ట్వీట్ లు చేశారు. గ్రేట్ మొత్తానికి భీమ్లా నాయక్ సినిమాను హిందీలో విడుదల చేస్తున్నారు.
Advertisement
కాబట్టి తన సినిమా పుష్ప కంటే పెద్ద సినిమా అని ప్రూవ్ చేసుకునే టైమ్ వచ్చింది. పవన్ కల్యాణ్ అల్లు అర్జున్ కంటే పెద్ద అని ప్రూవ్ చేసుకునే సమయం వచ్చింది. అంటూ ఆర్జీవీ తన ట్వీట్ లో పేర్కొన్నారు. అక్కడితో ఆగకుండా రామ్ గోపాల్ వర్మ పుష్ప సినిమాను భీమ్లానాయక్ బీట్ చేస్తుందా అంటూ ట్విట్టర్ లో పోల్ కూడా పెట్టారు. ఇక వర్మ ట్వీట్ లకు మెగా ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ముందు నీ సినిమాలు చూసుకో అంటూ ఫైర్ అవుతున్నారు.