Home » కొడాలి కంటే ముందు కేసినో ను ఎంకరేజ్ చేసింది ఎన్టీయారే.. వర్మ సెన్సేషనల్ కామెంట్స్…!

కొడాలి కంటే ముందు కేసినో ను ఎంకరేజ్ చేసింది ఎన్టీయారే.. వర్మ సెన్సేషనల్ కామెంట్స్…!

by AJAY
Ad

ఏపీలోని గుడివాడ లో సంక్రాంతి పండుగకి అసాంఘిక కార్యకలాపాలు, జూదం, కేసినో నిర్వహించారని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అంశం పై ఇటీవల స్పందించిన వర్మ కొడాలి నాని గుడివాడ ను అభివృద్ధి చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేశారు. కాగా తాజా వర్మ మరోసారి గుడివాడ కేసినో పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Rgv comments on ntramarao

Advertisement

Advertisement

గుడివాడలో కేసినో మొదటి సారిగా 1977 లో ఎన్టీ రామారావు ఆధ్వర్యం లో నిర్వహించారని ఎన్టీఆర్ హీరోగా నటించిన యమగోల సినిమాలోని గుడివాడ వెళ్ళాను పాటను షేర్ చేశారు. కొడాలి నాని కంటే ముందే నేను గ్రేట్ జయమాలిని ద్వారా గుడివాడ లైఫ్ స్టైల్ గురించి తెలుసుకున్నా అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఈ పాట సినిమాలో పెట్టడానికి ఒప్పుకున్నారని…కాబట్టి టిడిపి వాళ్ళు కొడాలి నాని కంటే ముందు ఎన్టీఆర్ ను ప్రశ్నించాలని వర్మ పేర్కొన్నారు. జయమాలిని పాట ద్వారా కేసినో ను మొదట గా ఎంకరేజ్ చేసింది ఎన్టీఆర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Visitors Are Also Reading