విజయనిర్మల కుమారుడిగా టాలీవుడ్ కు పరిచయం అయిన నరేష్ కెరీర్ ప్రారంభంలో హీరోగా సినిమాలు చేశాడు. జంబలకడిపంబ లాంటి కామెడీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను నవ్వించాడు. ఈ సినిమాతో పాటూ పలు చిత్రాలలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరవాత కేవలం హీరో పాత్రలకే పరిమితం అవ్వకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా సినిమాలు చేయడం మొదలు పెట్టాడు. ఇక ప్రస్తుతం తండ్రి పాత్రలు ఇతర ముఖ్యమైన పాత్రలు చేస్తూ టాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు.
Advertisement
ముఖ్యంగా కామెడీ పాత్రలలో నరేష్ నటన ప్రేక్షకులకు ఎంతగానో నచ్చుతుంది. అదే విధంగా ఎమోషనల్ పాత్రల్లోనూ నటించగలగడం గొప్పే అని చెప్పాలి. రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ కు తండ్రిగా నటించిన నరేష్ ఎమోషనల్ సీన్లలో ఏడిపించేశాడు. ఇదిలా ఉంటే నరేష్ పర్సనల్ లైఫ్ మాత్రం ఎప్పుడూ వార్తల్లోకి ఎక్కుతూ ఉండటం తెలిసిందే. నరేష్ కు ఇప్పటికే రెండు పెళ్లిళ్లు కాగా ఇప్పుడు మూడో వివాహానికి సిద్దం అవుతున్నట్టుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Advertisement
నరేష్ నటి పవిత్ర లోకేష్ ను పెళ్లి చేసుకోబోతున్నారని జోరుగా వార్తలు వినిపిస్తున్నాచి. ఇదిలా ఉంటే నరేష్ మూడో భార్య కూడా అప్పట్లో చీటింగ్ కేసులో ఆరోపణలు ఎదురుకుని వార్తల్లోకి ఎక్కింది. నరేష్ మూడో భార్య పేరు రమ్య రఘుపతి…ఆమె నరేష్, విజయనిర్మల పేరు చెప్పికొంతమంది వద్ద డబ్బులు తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసు స్టేషన్ లో కేసులు కూడా బుక్ అయ్యాయి.
ఇక ఇప్పటికే నరేష్ రమ్య రఘుపతితో విడాకాలు తీసుకోగా ఆమె ప్రవర్తన వల్లే విడిపోవాల్సి వచ్చిందని చెప్పాడు. ఇదిలా ఉంటే నరేష్ కు విజయ నిర్మల మొదట కెమెరామెన్ శ్రీను కుమార్తె ను వివాహం చేసుకోగా వీరికి కుమారుడు నవీన్ ఉన్నాడు. వీరిద్దరూ విడిపోయారు. ఆ తరవాత దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలు రేఖ సుప్రియను రెండో వివాహం చేసుకున్నాడు. కొంత కాలం తరవాత ఆమెతో కూడా విడిపోయి రమ్య రఘుపతిని వావాహం చేసుకున్నాడు. ఇప్పుడు 60ఏళ్ల వయసులో పవిత్రలోకేష్ తో పెళ్లి అంటూ వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై నరేష్ ఎలా స్పందిస్తాడో చూడాలి.