Home » ఆచార్య ఎన్.జీ.రంగా యూనివర్సిటీ నుంచి నోటిఫికేషన్ విడుదల.. ఏంటంటే..?

ఆచార్య ఎన్.జీ.రంగా యూనివర్సిటీ నుంచి నోటిఫికేషన్ విడుదల.. ఏంటంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో వ్యవసాయం సంబంధించినటువంటి కోర్సుల్లో ప్రవేశాలు కోరుతూ అగ్రి పాలీ సెట్ నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2022 మరియు 2023 విద్యా సంవత్సరానికి గాను పశువైద్య, మత్స్య, ఉద్యానవన, వ్యవసాయ యూనివర్సిటీలో డిప్లమా కోర్సులకు ప్రవేశాలు కల్పిస్తున్నారు. దీనికి పదవ తరగతి పాసైనవారు నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీని ప్రవేశ పరీక్షను జులై ఒకటో తేదీన నిర్వహిస్తారు.

Advertisement

దరఖాస్తు : ఆన్లైన్లో చేసుకోవచ్చు.
అప్లికేషన్ అమౌంట్ : 600 రూపాయలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 500 రూపాయలు.
దరఖాస్తు ప్రారంభం : మే 18వ తేదీ నుండి.
ప్రవేశ పరీక్ష తేదీ : జులై 1
వెబ్సైట్ :http://www.angrau.ac.in

Advertisement

Visitors Are Also Reading