Virata Parvam Movie: రానా సాయిపల్లవి జంటగా నటించిన విరాటపర్వం సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా యేడాది క్రితమే షూటింగ్ ను పూర్తిచేసుకుని విడుదలకు సిద్దమైంది. కానీ కరోనా ఇతర కారణాల వల్ల సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఇక సినిమా టీజర్, ట్రైలర్ లు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలా ఎన్నో అంచనాల మధ్య నేడు విడుదలైన ఈ చిత్రానికి సర్వత్రా పాజిటివ్ టాక్ వస్తోంది.
అయితే సినిమాకు హిట్ టాక్ రావడానికి కారణాలు ఎంటో ఇప్పుడు చూద్దాం….ముందు నుండి ఈ సినిమాకు పాజిటివ్ బజ్ ఉంది. రానా లాంటి స్టార్ ఈ సినిమాలో నటించడం. వేణు ఉడుగుల ఇప్పటికే తన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ప్రేక్షకులు సినిమా చూసేందుకు భారీగా వస్తున్నారు.
Advertisement
Advertisement
అప్పట్లో నక్సల్స్ బ్యాక్ డ్రాప్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. కానీ చాలా కాలం నుండి అలాంటి సినిమాలు రావడం లేదు. దాంతో ఈ సినిమాకు పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఈ సినిమాలో సాయిపల్లవి మరో హీరో అనే చెప్పాలి. టీజర్ ట్రైలర్ లో చూపించినట్టుగా సాయిపల్లవి పాత్ర ఎంతగానో ఆకట్టుకుంది. సాయి పల్లవి తన కండ్లతోనే భావాలను పలికిస్తూ ప్రేక్షకులను ఫిదా చేసింది. రానా సైతం తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశాడు.
Also Read: “అగ్నిపథ్” గురించి ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే.. వారికి జీతాలు ఎంతంటే..?
భారతక్క పాత్రలో నటించిన ప్రియమణి కూడా జీవిచేసింది. సినిమాలో ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా వేణు ఊడుగుల నాచురల్ గా తెరకెక్కించారు. దాంతో నాచురాలిటీగా దగ్గరగా ఉన్న ఈ సినిమాను ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. సినిమాలో కథతో పాటూ పాటలు రావడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా క్లైమాక్స్ కూడా ప్రేక్షకులకు నచ్చడంతో థియేటర్ నుండి మంచి ఎమోషన్ తో ప్రేక్షకులు బయటకు వెళుతున్నారు.
Also Read: స్టార్ మాలో సుధీర్ రెమ్యునరేషన్ ఎంతో మీకు తెలుసా..?