చిత్రం సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన యంగ్ హీరో ఉదయ్ కిరణ్. మొదటి సినిమాతోనే ఉదయ్ కిరణ్ ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్నాడు. ఈ ప్రేమ కథ చిత్రం యూత్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఉదయ్ కిరణ్ సొట్టబుగ్గల అందానికి అమ్మాయిలు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ మనసంతా నువ్వే, నువ్వు నేను సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ అందుకున్నారు. ఆ తర్వాత కెరీర్ లో తిరిగి చూసుకోలేదు. కానీ ఆ ఆనందం ఉదయ్ కిరణ్ కు ఎక్కువకాలం నిలవలేదు.
Advertisement
వరుస ఫ్లాపులు పడటం మొదలయ్యింది. అడ్వాన్స్ లు ఇచ్చిన నిర్మాతలు ఆ అడ్వాన్స్ లను తిరిగి వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాత వివాహం చేసుకోవడం డిప్రెషన్ లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకోవడం జరిగిపోయాయి. ఇదిలా ఉంటే దిల్ సినిమా తో పాపులారిటీని సంపాదించుకున్న నటుడు దిల్ రమేష్ ఓ ఇంటర్వ్యూ లో ఉదయ్ కిరణ్ గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.
ఉదయ్ కిరణ్ తో నువ్వు నేను సినిమా లో కలిసి నటించానని తెలిపారు. ఉదయ్ కిరణ్ కు నువ్వు నేను రెండో సినిమా అని అతడు చనిపోయే వరకు తనతో చాలా క్లోజ్ గా ఉన్నాడని అన్నారు. ఉదయ్ కిరణ్ చనిపోవడం అనేది తన జీవితంలోనే బ్యాడ్ ఇన్సిడెంట్ అని చెప్పాడు. పెద్ద హీరోల దగ్గర రిజర్వ్డ్ గా ఉంటామని.. కానీ చిన్నవయసు ఉన్న హీరోల దగ్గర ఫ్రెండ్లీగా ఉంటామని తెలిపాడు.
Advertisement
ఉదయ్ కిరణ్ అప్పటికే స్టార్ హీరో అయినప్పటికీ చాలా క్లోజ్ గా ఉండేవాడని అన్నారు. ఉదయ్ కిరణ్ మంచి కుర్రాడు కానీ ఫ్రస్టేషన్ లో ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. ప్రతి వ్యక్తి జీవితంలో సంతృప్తి అనేది ముఖ్యం అని అన్నారు. పుట్టినప్పటినుండి చనిపోయేవరకూ సంతృప్తి అనేది ఉండాలన్నారు. కానీ మనిషికి కోరికలు పెరిగిపోయి అలా జరగడం లేదని చెప్పారు. కోరికలు పెరిగి పోవడం వల్లే మనుషులు కుంగిపోతున్నారని చెప్పాడు. ఇక ఉదయ్ కిరణ్ కు చిరంజీవి పెద్దకుమార్తెతో ఎంగేజ్మెంట్ జరిగి పెళ్లి క్యాన్సల్ అవ్వడం ఆ తరవాత వచ్చిన ఇబ్బందుల వల్లే సినిమా ఆఫర్ లు రాలేదని అప్పట్లో వార్తలు వినిపించేవి. కానీ ఆ వార్తలను ఉదయ్ కిరణ్ సోదరే ఖండించారు. సినిమాల వల్లే ఉదయ్ కిరణ్ డిప్రెషన్ లోకి వెళ్లాడని చెప్పారు. ఇప్పుడు దిల్ రమేష్ మాటల్లో కూడా అదే అర్థం వస్తోంది.