Home » దినేష్ లో ఆకలి కనిపించింది.. అందుకే..?

దినేష్ లో ఆకలి కనిపించింది.. అందుకే..?

by Azhar
Ad

దినేష్ కార్తీక్ అనే పేరు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో ఎక్కువగా ప్రచారంలో ఉంది. కెరియర్ ముగిసిపోయింది అనుకున్న సమయంలోనే కెరియర్ బెస్ట్ ఫామ్ కు వచ్చిన దినేష్ కార్తీక్ ఇప్పుడు ఇండియా జట్టులో అదరగొడుతున్నాడు. అందుకే అతడిని ఆసియా కప్ కు కూడా ఎంపిక చేసారు. అయితే దినేష్ కార్తీక్ ఇలా ఇండియా జట్టులోకి రావడనికి కారణం అతను ఐపీఎల్ 2022 లో ఆర్సీబీ జట్టు తరపున చేసిన ప్రదర్శన.

Advertisement

అయితే ఐపీఎల్ 2022 లో ఆన్ సోల్డ్ గా మిగిలిపోతాడు అనుకున్న దినేష్ కార్తీక్ ను ఏకంగా 5 కోట్ల 50 లక్షలకు కొనుగోలు చేసింది ఆర్సీబీ. అయితే ఈ సీజన్ లో ఫినిషర్ గా అద్భుతం చేసాడు కార్తీక్. కానీ అతడి కోసం అంత ఖర్చు చేయడం గురించి ఆర్సీబీ హెడ్ కోచ్ మైకేల్ హస్సి కామెంట్స్ చేసాడు. ఐపీఎల్ మెలానికి ముందు అతడిలో ఓ ఆకలి చూసాం అని చెప్పాడు.

Advertisement

ఐపీఎల్ 2022 కు ముందు ఎలాగైనా ఇండియా జట్టులోకి రావాలి అనే పట్టుదల కార్తీక్ లో కనిపించింది. అడవి నుండి వచ్చిన పులి ఆకలిల ఆతని పరుగుల ఆకలి ఉంది. అందుకే అతని కోసం ఎంత ఖర్చు చేయడానికైనా సిద్ధమయ్యాము. ఇక ఐపీఎల్ ప్రారంభానికి ముందే అతడి నుండి ఏం కావాలి అనుకుంటున్నామో అతడికి వివరించం. దాని ప్రతిఫలమే మీరు ఈ ఐపీఎల్ లో.. ఇప్పుడు ఇండియా జట్టులో కూడా చూస్తున్నారు అని మైకేల్ హస్సి అన్నారు.

ఇవి కూడా చదవండి :

ఈ పిచ్చి పిచ్చి కామెంట్స్ ఆపండి..!

పాకిస్థాన్ పరువు తీసేసిన బాబర్..!

Visitors Are Also Reading