Home » సర్కారు వారి పాటలో పవన్ కళ్యాణ్ పాట పెట్టడానికి కారణం ఏంటో తెలుసా..?

సర్కారు వారి పాటలో పవన్ కళ్యాణ్ పాట పెట్టడానికి కారణం ఏంటో తెలుసా..?

by Azhar
Ad
2020 లో సరిలేరు నీకెవ్వరూ అనే సినిమాతో అభిమానుల ముందుకు వచ్చిన మహేష్ బాబు మళ్ళీ రెండేళ్లు దాటినా తర్వాత సర్కారు వారి పాట అనే సినిమాతో వచ్చారు. అయితే ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్న ప్రపంచాన్ని వణికించిన కరోనా కారణంగా విడుదల ఆలస్యమైంది. అయితే సర్కారు వారి పాట విడుదల రోజు మంచి పాజిటివ్ టాక్ తెచుకున్న ఆ తర్వాత మాత్రం యావరేజ్ గానే ఉంది అనే రేంజ్ కు వచ్చింది. అయినా కూడా ఈ సినిమా 200 కోట్లు కలెక్ట్ చేసింది అంటే అది కేవలం మహేష్ బాబు సత్తా అనే చెప్పాలి.
అయితే ఈ సినిమా దర్శాకత్వం వహించిన దర్శకుడు పరుశురాం తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. అందులో ఈ సినిమాలో అభిమానులకు అర్ధం కానీ కొన్ని విషయాలను తెలిపాడు. మొదట ఇందులో మహేష్ బాబు ఆలా హీరోయిన్ మీద కాలు వేయడం ఏమిటి అని అడిగిన ప్రశ్నకు.. తన చిన్నతనంలోనే అమ్మనాన్నకు కోల్పోయిన హీరో.. తన పక్కన పడుకున్న హీరోయిన్ లో వల్ల అమ్మను ఉహించుకొని అలా కలువేసుకొని పడుకున్నాడు. తప్ప అందులో ఏ చేదు ఆలోచన లేదు. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటె మహేష్ బాబుగారే ముందు ఆ సిన్ చేయను అని చెప్తారు అని తెలిపారు.
అలాగే ఈ సినిమాలో హీరోయిన్ మామయ్య సుబ్బరాజుకు ఫోన్ వచ్చినప్పుడల్లా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీంల నాయక్ సినిమాలోనే పాట.. లాలా భీమ్ల అనే పాట వస్తుంది. ఆ పాట వచినప్పుడలా పవన్ అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు. అయితే అక్కడ రింగ్ టోన్ గా ఆ పాటె ఎందుకు పెట్టారు అని ప్రశ్నించగా.. నేను థమన్ ఆ రింగ్ టోన్ పాట కోసం చాలా పాటలు ట్రై చేసాం. కానీ ఏది సరిగ్గా లేదు. మ్యూజిక్ సరిగ్గా వినిపించడం లేదు. దాంతో థమన్ ఈ భీమ్ల నాయక్ పాట పెడుదాం అని చెప్పాడు. నేను కూడా ఓకే చెప్పను. అంతే… అంతకు మించి ఏ ఉదేశ్యం లేదు పరుశురాం అన్నారు.

Advertisement

Visitors Are Also Reading