Home » గబ్బర్ సింగ్ లో నటించినందుకు అప్పు ఎందుకు సినిమాలను మానివేయాల్సి వచ్చిందట .! ఎందుకంటే ?

గబ్బర్ సింగ్ లో నటించినందుకు అప్పు ఎందుకు సినిమాలను మానివేయాల్సి వచ్చిందట .! ఎందుకంటే ?

by AJAY
Ad

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన హ్యాపిడేస్ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా ద్వారా చాలామంది టాలీవుడ్ కు పరిచయమయ్యారు. ప్రస్తుతం ఈ సినిమాతో పాపుల‌ర్ అయిన వారిలో స్టార్ హీరోలు, హీరోయిన్లు సైతం ఉన్నారు. హ్యాపీ డేస్ తో పరిచయమైన కొంతమంది సక్సెస్ లో ఉంటే మరి కొంత మంది మాత్రం పూర్తిగా సినిమాలకు గుడ్బై చెప్పారు. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన వరుణ్ సందేష్ అడపాదడపా సినిమాలు చేస్తున్న‌ సంగతి తెలిసిందే.

Advertisement

హీరో నిఖిల్ ప్రస్తుతం వ‌రుస సినిమాల‌తో ఫామ్ లో ఉన్నాడు. అంతే కాకుండా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన తమన్నా ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఈ సినిమాలో నటించిన టైస‌న్ సినిమా అవకాశాల కోసం కష్టపడుతున్నాడు. మరోవైపు ఈ సినిమాలో నిఖిల్ గర్ల్ ఫ్రెండ్ గా న‌టించిన అప్పు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. టామ్ బాయ్ లుక్ లో కనిపించి తన నటనతో ప్రేక్షకులను అలరించింది.

Advertisement

అప్పు అసలు పేరు గాయత్రీరావు…. అప్పు తల్లిదండ్రులు కూడా టాలీవుడ్ లోనే నటీనటులు కావడం విశేషం. గాయ‌త్రిరావు తల్లి టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న బెంగుళూరు పద్మ అనే విషయం చాలామందికి తెలియదు. ఇక అప్పు హ్యాపీ డేస్ సినిమా తర్వాత మళ్ళీ గబ్బర్ సింగ్ సినిమాలో శృతి హాసన్ కు ఫ్రెండ్ గా కనిపించి ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా తర్వాత సినిమాలకు దూరం అయింది.

అప్పు సినిమాలకు దూరం అవడానికి కారణం కూడా గబ్బ‌ర్ సింగ్ సినిమానే కార‌ణ‌మ‌ట‌. ఓ ఇంట‌ర్వ్యూలో బెంగుళూరు ప‌ద్మ మాట్లాడుతూ…గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాలో మొద‌ట ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీ అని చెప్పి ఒప్పించార‌ని కానీ విడుద‌లైన త‌ర‌వాత గాయ‌త్రిరావు పాత్ర‌కు నెగిటివ్ కామెంట్లు వ‌చ్చాయ‌ని చెప్పారు. దాంతోనే గాయ‌త్రి సినిమాల్లోన‌టించ‌కూడ‌ద‌ని నిర్న‌యం తీసుకుందని చెప్పారు. 2019లో గాయ‌త్రి వివాహం కాగా ప్ర‌స్తుతం త‌న భ‌ర్త‌తో హ్యాపీ ఉంటోంది.

ALSO READ : నేనూ..యల్లారీశ్వరి..విజయలచ్మి, జోతిలచ్మి, జైమాల్నిపాటలు గుర్తున్నాయా.. ఓ లుక్కేయండి..?

Visitors Are Also Reading