Home » నిజంగా వెంకటేష్, రోజాల మధ్య 25 ఏళ్లుగా మాటలు లేవా.. కారణం ఏంటి?

నిజంగా వెంకటేష్, రోజాల మధ్య 25 ఏళ్లుగా మాటలు లేవా.. కారణం ఏంటి?

by Bunty
Ad

టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు వెంకటేష్. మూడు దశాబ్దాల సినీ కెరీర్ లో ఎన్నో అద్భుత సినిమాల్లో నటించారు. స్వర్ణకమలం లో ఛాలెంజింగ్ పాత్రతో పేక్షకులను మెప్పించినా, చంటి సినిమాతో అమాయకుడిగా అలరించినా, సూర్యవంశం లో డబుల్ రోల్ తో మెస్మరైజ్ చేసినా, నువ్వు నాకు నచ్చావు లో నవ్వులతో ఆకట్టుకున్నా, మల్లీశ్వరిలో ఆధ్యాంతం పంచులు వేసినా అది ఆయనకే సాధ్యం.

Advertisement

ఇదంతా పక్కకు పెడితే, వెంకటేష్, రోజా మధ్య 25 సంవత్సరాలుగా మాటలు లేవన్న ప్రచారం ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉంది. ఈ విషయంపై తాజాగా వెంకటేష్ మేకప్ మ్యాన్ రాఘవ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. వీరిద్దరి కాంబినేషన్ లో పోకిరి రాజా అనే సినిమా వచ్చింది. ఈ సినిమా డిజాస్టర్ అయింది. ఆ తర్వాత కొన్నాళ్లకు వెంకటేష్ హీరోగా రాజా సినిమా తెరకెక్కింది. ఈ సినిమా తమిళం నుంచి రీమేక్ చేశారు. తమిళ్ వెర్షన్ లో రోజా హీరోయిన్ గా నటించింది.

Advertisement

తెలుగులో ఆమెను హీరోయిన్ గా తీసుకోవాలని ముందుగా అనుకున్నారు. ఆ విషయాన్ని రోజా దృష్టికి కూడా తీసుకువెళ్లారు. దీంతో వెంకటేష్ పక్కన తానే హీరోయిన్ అని రోజా ఫిక్స్ అయిపోయారు. అయితే వెంకటేష్, సౌందర్య జోడికి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని సౌందర్యను హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే కావాలనే వెంకటేష్ తనను తప్పించి సౌందర్యను హీరోయిన్ గా పెట్టుకోవాలని దర్శకనిర్మాతలకు చెప్పినట్టు రోజా ఫీల్ అయ్యారట. అయితే వాస్తవంగా ఈ విషయంలో వెంకటేష్ కు మాత్రం ఏ సంబంధం లేదని రాఘవ చెప్పారు. దీంతో వెంకటేష్, రోజా మధ్య వివాదం చెరరేగిందట.

read also : ఆ ఒక్క త‌ప్పు చేసి ఉంటే చిరంజీవి.. సురేఖ‌కు భ‌ర్త అయ్యేవాడు కాదంట‌..!

Visitors Are Also Reading