Home » సీఎస్‌కేపై మరోసారి కోపాన్ని చూపించిన జడేజా…!

సీఎస్‌కేపై మరోసారి కోపాన్ని చూపించిన జడేజా…!

by Azhar
Ad

టీం ఇండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఇప్పుడు మంచి ఫామ్ కనిపిస్తున్నాడు. ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన తర్వాత జడేజా సౌత్ ఆఫ్రికాతో టీ 20 సిరీస్ లో పాల్గొనలేదు. నేరుగా ఇంగ్లాండ్ కు వచ్చిన గత ఏడాది మిగిలిపోయిన ఆఖరి టెస్ట్ మ్యాచ్ లో ఆడాడు. అయితే ఈ టెస్ట్ లో బౌలింగ్ లో అంత ప్రభావం చూపించని జడేజా బ్యాటింగ్ లో మాత్రం సెంచరీ చేసాడు. ఐపీఎల్ 2022 లో అంత దారుణంగా విఫలమైన తర్వాత జడేజా ఇలా ఆడుతాడు అని ఎవరు అనుకోలేకాదు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభానికి ముందు జడేజాను చెన్నై సూపర్ కింగ్స్ తమ కెప్టెన్ గా అనౌన్స్ చేసింది.

Advertisement

కానీ సీజన్ ప్రారంభమైన తర్వాత మాత్రం అది పని చేయలేదు. జడేజా కెప్టెన్సీలో చెన్నై దారుణంగా విఫలమైంది. కెప్టెన్ గా జడేజా కూడా చాలా ఒత్తిడికి గురయ్యాడు. బ్యాటింగ్, బౌలింగ్ తో పాటుగా సింపుల్ క్యాచ్చులు వదిలేస్తూ.. ఫీల్డింగ్ లో కూడా ప్లాప్ అయ్యాడు. దాంతో చెన్నై యాజమాన్యం సీజన్ మధ్యలో జడేజాను కెప్టెన్ గా తప్పించింది. మళ్ళీ ఆ భాధ్యతలు ధోనికి అప్పగించింది. కానీ ఇది జడేజాకు నచ్చలేదు అని వార్తలు వచ్చాయి. యాజమాన్యంతో జడేజాకు విబేధాలు వచ్చాయని తెలిసింది. ఇక గాయం పేరుతో చివర్లో జడేజా కట్టుకు దూరం కావడం అందుకు మరింత బలాన్ని ఇచ్చింది.

Advertisement

అయితే చెన్నై యాజమాన్యం మాత్రం జడేజా తమ జట్టుతోనే ఉంటాడు.. ఏం విబేధాలు లేవు అని పేర్కొన్నారు. కానీ జడేజా ఇలా చెప్పలేదు. దానికి తోడు ఇప్పుడు తాజాగా జడేజా తన ఇంస్టాగ్రామ్ నుండి చెన్నై జట్టుకు సంబంధించిన అన్ని పోస్టులను తీసేసాడు. ఈ విధంగా జడేజా తన కోపాన్ని చూపించాడు అని తెలుస్తుంది. టెస్టులో తన సెంచరీ తర్వాత కూడా చెన్నై జట్టు గురించి మాట్లాడానికి జడేజా ఒప్పుకోలేదు. ఇక ఈ పరిణామాలు చూస్తుంటే.. వచ్చే సీజన్ లో జడేజా చెన్నై జట్టుకు ఆడటం కష్టంగానే కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి :

గంగూలీ వల్లే ఇప్పుడు టీం ఇండియా ఇలా ఉంది..!

ధోని హెయిర్ స్టైల్‌ మార్చడానికి దీపికానే కారణమా..?

Visitors Are Also Reading