Home » చెన్నైని విడుతు కొత్త జట్టులోకి జడేజా ఎంట్రీ..?

చెన్నైని విడుతు కొత్త జట్టులోకి జడేజా ఎంట్రీ..?

by Azhar
Ad

ఐపీఎల్ లో కొంతమంది ఆటగాళ్లు కొని జట్లకు ఆడితేనే చూడాలి అనిపిస్తుంది. అందులో రవీంద్ర జడేజా ఉంటాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోని జడేజాను చూడాలి అని ఫ్యాన్స్ అనుకుంటారు. కానీ వచ్చే ఐపీఎల్ సీజన్ నుండి ఇది జరగకపోవచ్చు అని తెలుస్తుంది. అందుకు కారణం ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో కెప్టెన్సీ పరంగా జడేజాకు చెన్నై జట్టుకు మధ్య వచ్చిన విబేధాలు అని అందరికి తెలుసు.

Advertisement

మొదట జడేజాను కెప్టెన్ చేసి.. ఓటములు రావడంతో మధ్యల తీసేయడం వల్ల జడేజా హాట్ అయ్యాడు, ఇంకాఆ తర్వాత సోషల్ మీడియాలో ఆ జట్టు పోస్టులు డిలీట్ చేసి అందరికి హిట్ ఇచ్చాడు. కానీ చెన్నై జట్టు మాత్రం జడేజా తమతోనే ఉంటాడు అని పేర్కొంది. కానీ ఇన్ని రోజులు జడేజా, చెన్నై మధ్య జరిగిన చర్చలు విఫలం కావడం.. అతను మరో జట్టులోకి వెళ్లడం ఖాయం అయ్యింది.

Advertisement

అయితే వచ్చే ఏడాది ఐపీఎల్ లో జడేజా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆడనున్నాడు అని తెలుస్తుంది. కానీ వీరు వేలంకు వెళ్లడం లేదు. ప్రస్తుతం ఢిల్లీ జట్టులో ఉన్న శార్దూల్ ఠాకూర్ అలాగే చెన్నైలో జడేజాను రెండు జట్లు ఇచ్చి పుచ్చుకుంటున్నాయి అని తెలుస్తుంది. అయితే ఐపీఎల్ 2021 వరకు చెన్నైలోనే ఉన్న శార్దూల్ ను ఈ ఏడాది జరిగిన మెగవేలంలో ఢిల్లీ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

వాన వాన.. సెమీస్ కు వెళ్లే జట్లేవి వాన..!

రాహుల్ ఐపీఎల్ లోనే ఆడుతాడు.. ఎందుకంటే..?

Visitors Are Also Reading