కిరిక్ పార్టీ సినిమా ద్వారా కన్నడ ఇండస్ట్రీకి పరిచయం అయిన ముద్దుగుమ్మ రష్మిక మందన. మొదటి సినిమాతోనే ఈ బ్యూటీ సూపర్ హిట్ అందుకుంది. ఆ తరవాత తెలుగులో నాగశౌర్య హీరోగా నటించిన ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. ఆ తరువాత తెలుగులో వరుస ఆఫర్ లను అందుకుంది. ఇక గీతాగోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది.
Advertisement
ఈ సినిమా తరవాత రష్మిక తిరిగి చూసుకోలేదు. గ్యాప్ లేకుండా ఆఫర్ లను అందుకుంది. ఇక పుష్ప సినిమాతో రష్మిక క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. పాన్ ఇండియా లెవల్ లో హిట్ కొట్టడంతో బాలీవుడ్ లోనూ ఆఫర్ లను అందుకుంది. ఇక వరుస ఆఫర్ లు అందడంతో రష్మిక చేతినిండా సంపాదిస్తోంది. భారీగా రెమ్యునరేషన్ అందుకోవడంతో పాటూ యాడ్స్ మరియు షాప్ ఓపెనింగ్ లతోనూ జేబులు నింపుకుంటోంది. అంతే కాకుండా రష్మిక తండ్రి కూడా ప్రముఖ వ్యాపారవేత్త కావడం విశేషం.
Advertisement
రష్మిక తండ్రికి తేయాకు తోటలు ఉన్నట్టు టాక్. దాంతో రష్మిక ఇండస్ట్రీలోకి వచ్చిన ఐదేళ్లకే ఐదు లగ్జరీ అపార్ట్మెంట్ లను కొనుగోలుచేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆ అపార్ట్మెంట్ లలో ఒకటి ముంబైలో ఉంది. దానిని రీసెంట్ గానే కొనుగోలు చేసింది. అంతే కాకుండా దానికంటే ముందు రష్మికకు బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ లలోనూ ఖరీదైన అపార్ట్మెంట్ లు ఉన్నాయి. వీటితో పాటూ ఢిల్లీలోనూ ఓ అపార్ట్మెంట్ ను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.