Home » ఓవైపు పెళ్లి పనులు.. అనుకోకుండా యువతి ఇంట్లోకి వందమంది.. చివరికి..!!

ఓవైపు పెళ్లి పనులు.. అనుకోకుండా యువతి ఇంట్లోకి వందమంది.. చివరికి..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఈ మధ్యకాలంలో ప్రేమ వ్యవహారాలు మరీ దారుణంగా తయారవుతున్నాయి.. ప్రేమించిన వారి కోసం ప్రాణాలు తీస్తున్నారు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.. ప్రేమ కోసం ఎంతటికైనా తెగిస్తున్నారు.. ఇంతకుముందు ఇదంతా సినిమాల్లో జరిగేది.. కానీ అలాంటి ఓ ఘటనే రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.. పూర్తి వివరాలు ఏంటో చూద్దాం.. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల కు చెందిన ముచ్చర్ల వైశాలి అనే యువతి డాక్టర్ చదువుతోంది.. యువతిని మిస్టర్ టీ టైం ఓనర్ నవీన్ రెడ్డి గాఢంగా ప్రేమించాడు. ఈ విషయం వైశాలి తల్లిదండ్రులకు కూడా తెలుసు..

Advertisement

also read:కేజీఎఫ్ ఫేం యశ్- రాధికల ప్రేమకథ ఎలా మొదలైందో తెలుసా ? 

Advertisement

అయినా వారి తల్లిదండ్రులు వైశాలికి మరో అబ్బాయి తో వివాహం నిశ్చయించారు. పెళ్లి పనులన్నీ వేగంగా జరుగుతున్నాయి. ఇంట్లోకి బంధువులు కూడా వచ్చేసారు.. ఇల్లంతా సందడి సందడి..ఇదే టైం లో ఎంట్రీ ఇచ్చారు వందమంది.. సినిమా స్టైల్ లో ఇంటి ముందు ఉన్న కార్లు,వస్తువులను పగలగొట్టారు.. ఇంట్లోకి చొరబడ్డారు.అడ్డు వచ్చిన వారిని కొట్టారు.. చివరికి వైశాలిని పట్టుకొని తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు నవీన్ రెడ్డి. ఈ సమయంలోనే వైశాలి తల్లిదండ్రులు కూడా అడ్డుకున్నారు.

కానీ నవీన్ రెడ్డి వారిని కూడా కొట్టి ఆ అమ్మాయిని తీసుకెళ్లాడు. ఇదంతా ఒక సినీ ఫక్కీలా జరిగింది. ఈ విషయం కాస్త బయటికి రావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. దీంతో వైశాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు యువతి కోసం ప్రత్యేకమైన బృందాలు ఏర్పాటు చేసి గాలింపు మొదలుపెట్టారు. ఈ తరుణంలో వైశాలికి ఇష్టం ఉండి నవీన్ రెడ్డి ఆమెను తీసుకెళ్లాడా.. లేదంటే బలవంతంగా లాక్కెళ్లాడా అనేది తెలియాల్సి ఉంది..

also read:

Visitors Are Also Reading