Home » అనాధలాగా కృష్ణ మృతదేహం…నరేష్ చేసిన పనికి విజయనిర్మల ఆత్మ ఎంత బాధపడిందో – రమ్య రఘుపతి

అనాధలాగా కృష్ణ మృతదేహం…నరేష్ చేసిన పనికి విజయనిర్మల ఆత్మ ఎంత బాధపడిందో – రమ్య రఘుపతి

by Bunty
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు నరేష్-పవిత్ర లోకేష్ ల రిలేషన్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల వీరిద్దరు వివాహం చేసుకోబోతున్నట్టు డిసెంబర్ 31వ తేదీన అఫీషియల్ గా ప్రకటించారు. అంతేకాదు ఇద్దరూ ముద్దు పెట్టుకుని పెళ్లి చేసుకుంటామంటూ, కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం అంటూ రిలీజ్ చేసిన వీడియో వైరల్ అయింది. దీనిపై తాజాగా నరేష్, పవిత్రల పెళ్లి జరగనివ్వనంటూ రమ్య రఘుపతి ఫైర్ అయ్యింది.

READ ALSO : బాలయ్యకు పెను ప్రమాదం.. హెలికాప్టర్‌ అత్యవసర ల్యాండింగ్‌

Advertisement

 

మా ఇద్దరికీ విడాకులు అయిపోయాయి అని ప్రచారం జరుగుతోంది. కానీ అందులో నిజం లేదని చెప్పింది. తమ విడాకుల ప్రక్రియ కోర్ట్ లో కొనసాగుతుందని తెలిపింది. కృష్ణగారి అంత్యక్రియల సమయంలో జరిగిన సంఘటనలు చెబుతూ వీడియో ప్రూఫ్ లను చూపిస్తూ నరేష్ చేసిన పనులు తన అత్త విజయనిర్మల క్షమించిందంటూ ఫైర్ అయ్యారు. కృష్ణగారు మరణించిన రోజు రాత్రి ఇంటివద్ద ఆయన మృతదేహం ఉంచి, మరుసటి రోజు ఉదయం ఏడు గంటల ప్రాంతంలో పద్మాలయ స్టూడియోకి తీసుకువెళ్లారని రమ్య తెలిపారు. ఆ రాత్రంతా మృతదేహం వద్ద కృష్ణ కుటుంబ సభ్యులు ఎవరూ లేరని వెల్లడించారు.

Advertisement

వాళ్ళందరూ పద్మాలయ స్టూడియోకు తీసుకెళ్లడమా, ఇక్కడ ఉంచడమా, అనే కన్ఫ్యూజన్ లో ఉండగా, నరేష్ అసలు ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్లాడో కూడా తెలియదని…కృష్ణ గారి మృతదేహంను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయాడు అంటూ తెలిపారు రమ్య. రాత్రి తొమ్మిది గంటల ప్రాంతం నుండి దాదాపు ఉదయం 6 గంటల వరకు మృతదేహం వద్ద కేవలం రమ్య రఘుపతి, ఆమె కొడుకు రన్వీర్ మాత్రమే శవ జాగారం చేశారట. ఇక కొంతమంది డ్రైవర్లు తప్ప ఎవరూ లేరు. ఈ విషయాలను రమ్య రఘుపతి తాజాగా తెలిపారు.

READ ALSO : రోజాది నోరుకాదు.. మున్సిపాలిటి చెత్త కుప్ప : నాగబాబు

Visitors Are Also Reading