సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమా హిట్ ఫ్లాప్ కు సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. ఇటీవల రాంగోపాల్ వర్మ రాజకీయ నాయకుడు కొండా మురళి బయోపిక్ ను తెరకెక్కించారు. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ సినిమాకు భారీగా ప్రచారం చేసినా నెగిటివ్ టాక్ ను మూటకట్టుకుంది. ఇదిలా ఉండగానే తాజాగా మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో లడ్కీ అనే మరో సినిమాను విడుదల చేశాడు.
చాలా కాలం తర్వాత ఆర్జీవి సినిమాలలో లడ్కీ సినిమాకు పాజిటివ్ రివ్యూ లు వస్తున్నాయి. ఈ సినిమా బాగుందని యాక్షన్ సీన్లు బాగున్నాయని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగానే వర్మ తాజాగా మరో సినిమాను ప్రకటించాడు. కరోనా నేపథ్యంలో దేశంలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే సడన్ గా ప్రధానమంత్రి మోడీ లాక్ డౌన్ అనౌన్స్ చేయడంతో చాలామంది ప్రజలు అవస్థలు పడ్డారు.
Advertisement
Advertisement
వలస కూలీలు పడిన ఇబ్బందుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వందల కిలోమీటర్లు నడిచి గమ్యస్థానాన్ని చేరుకోలేక ప్రాణం విడిచిన వాళ్ళు కూడా ఉన్నారు. అంతేకాకుండా లాక్ డౌన్ వల్ల చాలామంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యారు. ఇక ఇదే విషయంపై వర్మ సినిమా చేస్తానని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
సినిమాలో ప్రజలు పడిన బాధలు…. వలస కార్మికుల ఇబ్బందులు, గంగానది ఒడ్డున శవ దహనాలు లాంటి వాటితో పాటు వ్యవస్థలో ఉన్న లోపాలు అధికారుల అవినీతి లాంటివి చర్చిస్తానంటూ ప్రకటించారు. కరోనా సెకండ్ వెబ్ కు వైరస్ కారణం కాదని కొందరు స్వార్ధపరుల దురాశ అని పేర్కొన్నారు. లక్షలాదిమంది చనిపోతున్న ప్రభుత్వం వ్యవహరించిన తీరును తేట తెల్లం చేస్తానని వర్మ స్పష్టం చేశాడు. దీనికి సాక్షాలుగా కరోనా సమయంలో తీసుకున్న ఫోటోలను వర్మ షేర్ చేశారు. ఈ చిత్రాల వల్ల రాబోయే ఎన్నికల్లో ఓటర్ల కోపాన్ని పార్టీలు చూస్తాయని పేర్కొన్నారు.