Home » మ‌న బంధం మ‌రింత బ‌ల‌ప‌డుతోంది…అకీరా పై చ‌ర‌ణ్ ఎమోష‌నల్ పోస్ట్…!

మ‌న బంధం మ‌రింత బ‌ల‌ప‌డుతోంది…అకీరా పై చ‌ర‌ణ్ ఎమోష‌నల్ పోస్ట్…!

by AJAY
Ad

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కుమారుడు అకీరా నంద‌న్ గురించి ప్ర‌త్యేంక‌గా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అకీరా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వ‌క‌పోయినా ఇప్ప‌టికే అభిమానుల‌ను సంపాదించుకున్నారు. ఇక అకీరా నంద‌న్ త‌న త‌ల్లి రేణూ దేశాయ్ వ‌ద్ద ఉంటున్న సంగ‌తి తెలిసిందే. కాగా నేడు అకీరా నంద‌న్ త‌న 18వ పుట్టిన రోజును జ‌రుపుకుంటున్నారు. ఈ సంధ‌ర్బంగా అభిమానులు, ప్ర‌ముఖులు అకీరా నంద‌న్ కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు.

Advertisement

Advertisement

ఈ నేప‌థ్యంలోనే మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కూడా అకీరా నంద‌న్ కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్పారు. అకీరా మ‌న బంధం ఏళ్లు గ‌డిచే కొద్దీ మ‌రింత బ‌ల‌ప‌డుతోంది. నిన్ను ఎంత‌గానో ప్రేమిస్తున్నాం అంటూ రామ్ చ‌ర‌ణ్ ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టారు. ఇక రామ్ చ‌రణ్ గ‌తంలోనూ అకీరా పై ఎమోష‌నల్ పోస్ట్ లు పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే అకీరా నంద‌న్ కు 18 ఏళ్లు నిండిన నేప‌థ్యంలో అత‌డి ఎంట్రీ త్వ‌ర‌లోనే ఉండ‌బోతుంద‌ని ప‌వ‌న్ ఫ్యాన్స్ కుషీ అవుతున్నారు. కానీ నేడు రేణూ దేశాయ్ సోష‌ల్ మీడియాలో అకీరా నంద‌న్ ఎంట్రీ ఉండ‌బోదని స్ప‌ష్టం చేసింది.

Visitors Are Also Reading