టాలీవుడ్ లో హీరోయిన్ లు రాణించిన అందాల తారల్లో రంభ కూడా ఒకరు. రంభ అందానికి టాలీవుడ్ ఫిదా అయిపోయింది. అతి తక్కువ కాలంలోనే రంభ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అంతే కాకుండా స్టార్ హీరోల పక్కన ఛాన్స్ లు అందుకుంది. గ్లామర్ రోల్స్ తో పాటూ తన పాత్రలు ప్రాధాన్యత ఉన్న సినిమాలలోనూ నటించి ప్రేక్షకులను అలరిచింది. అయితే రంభ ఓసారి షూటింగ్ లో జరిగిన అవమానం వల్ల గుక్క పెట్టి ఏడ్చేసిందట. ఇంతకీ రంభను అంతలా అవమానించింది ఎవరు..? ఎందుకు ఏడ్చింది అన్నది ఇప్పుడు చూద్దాం…
Advertisement
రాఘవేంద్రరావు దర్శకత్వంలో రంభ జేడీ చక్రవర్తి జంటగా బొంబాయి ప్రియుడు అనే సినిమాలో నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక రాఘవేంద్రరావు సినిమాలోని పాటలు ఏవిధంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాటల్లో ఖచ్చితంగా హీరోయిన్ బొడ్డు పై పువ్వులు పూలు పడాల్సిందే.
Advertisement
ఈ సినిమాలోనూ అలాంటి ఓ సీన్ ఉంది. ఆ సీన్ లో జేడీ చక్రవర్తి రంభ బొడ్డుపై బత్తాయి పండ్లు విసురుతూ నెక్స్ట్ పుచ్చకాయవేస్తానంటూ జోకులు చేశాడట. దాంతో అక్కడ ఉన్నవాళ్లు అంతా పడిపడి నవ్వేశారట. రంభ కూడా చాలా సేపు నవ్వుతూ ఉండిపోయిందట. కానీ రాఘవేంద్రరావు మాత్రం తరవాత సీన్ గురించి ఆలోచిస్తూ చాలా సీరియస్ గా ఉన్నారట.
ఇక వీళ్లు షూటింగ్ లో జోకులు వేస్తుండటంతో రాఘవేంద్రరావుకు కోపం వచ్చి రంభను పక్కకు పిలిచారట. ఎంతసేపు నవ్వుకుంటారో నవ్వుకోండి మీరు నవ్వుకోవడం అయిపోయిన తరవాతనే షూటింగ్ ను తిరిగి ప్రారంభిస్తానని సీరియస్ గా చెప్పారట. అందరి ముందు అలా అనడంతో రంభ చాలా సేపు ఏడుస్తూ ఉండిపోయిందట.
ALSO READ : ఒకే సినిమాలో హీరోగా మరియు విలన్ గా అదరగొట్టిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే ….!