Home » బాలీవుడ్ పరువు తీసేసిన వర్మ..!

బాలీవుడ్ పరువు తీసేసిన వర్మ..!

by Azhar
Ad

టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అంటేనే కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా ఉంటాడు అనే విషయం అందరికి తెలిసిందే. అయితే తాజాగా వర్మ బాలీవుడ్ హీరోల పరువు అనేది తీసేసాడు. ఈ మధ్య బాలీవుడ్ , సౌత్ ఇండస్ట్రీ మధ్య పెద్ద వార్ అనేది నడుతున్న విషయం తెలిసిందే. అక్కడి సినిమాలు ఒక్కటి కూడా హిట్ కాకుండా పోతుంటే… సౌత్ నుండి వెళ్లిన సినిమాలు సూపర్ హిట్ కొడుతున్నాయి.

Advertisement

ఈ క్రమంలోనే చాలా మంది బాలీవుడ్ పని అయ్యిపోయిందని.. వీరికి టాలీవుడ్ లా సినిమాలు తీయడం చేత కాదు అంటూ కామెంట్స్ చేస్తుంటే అక్కడి హీరోలు ఒప్పుకోవడం లేదు. అయితే ఈ మధ్యే బాలీవుడ్ బడా హీరోలు అయిన అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా సినిమాతో పాటుగా అక్షర్ కుమార్ రక్షాబంధన్ సినిమా కూడా విడుదల అయ్యింది. వీటితో పాటుగానే మన టాలీవుడ్ కు చెందిన యువ హీరో నిఖిల్ నటించిన కార్తికేయ 2 అనే సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యింది.

Advertisement

కానీ కార్తికేయ 2 సినిమా అనేది అనుకున్న దానికంటే పెద్ద హిట్ అయ్యి భారీ కలెక్షన్స్ సాధిస్తుంది. దీంతో ఈ సినిమాపై వర్మ స్పందిస్తూ.. కార్తికేయ 2 సినిమా ఈ రెండవ శుక్రవారమే అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా, అక్షయ్ కుమార్ రక్షాబంధన్ కంటే ఎంతో పెద్ద విజయం అందుకుంది అని పేర్కొన్నాడు. అలాగే ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా ఇంత పెద్ద హిట్ కావడంతో ఇది ఆర్ఆర్ఆర్, కేజిఎఫ్2 కంటే కూడా పెద్ద హిట్ అని వర్మ అన్నారు.

ఇవి కూడా చదవండి :

ఇండియాకోసం బ్యాన్ బౌలర్..!

21 ఏళ్ళ సచిన్ రికార్డ్ బ్రేక్ చేసిన గిల్…!

Visitors Are Also Reading