సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే నటులలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. నిత్యం సినిమాలతో చాలా బిజీగా ఉన్నప్పటికీ ఆమె ఇన్స్టా, ట్విటర్ వంటి సోషల్ ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటూ అభిమానులతో పలు విషయాలను షేర్ చేసుకుంటూనే ఉంటుంది. తాజాగా ఆమె టాలీవుడ్ సినిమాలపై, పెళ్లి గురించి వస్తున్న వార్తలపై స్పందించింది.
Advertisement
టాలీవుడ్లో ధృవ, సరైనోడు, నాన్నకు ప్రేమతో వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది రకుల్ప్రీత్ సింగ్. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న ఈ ఢిల్లీ బామ ప్రస్తుతం బాలీవుడ్లో వరుస సినిమాలను చేస్తోంది. గత కొంతకాలంగా ఈమె టాలీవుడ్ చిత్రాలకు దూరమైంది. చివరగా వైష్ణవ్ తేజ్ నటించిన ‘కొండ పొలం’ సినిమాలో నటించింది. ఇక ఆ తరువాత తెలుగు సినిమాల్లోనే నటించకపోవడం గమనార్హం. తెలుగు సినిమాల్లో ఎందుకు నటించలేదని అభిమానులు చర్చించుకుంటుండగా.. ఈ విషయంపై తాజాగా రకుల్ స్పందించారు.
Advertisement
Also Read : పెళ్ళికి ముందు అల్లు రామలింగయ్య చిరంజీవిని సీక్రెట్ గా ఒక కంట కనిపెట్టేవారట ఎందుకంటే ?
‘త్వరలోనే తప్పకుండా తెలుగు సినిమాల్లో నటిస్తాను. ప్రస్తుతం నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దీనికి కారణం టాలీవుడ్ ఇండస్టీ’ అని చెప్పుకొచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. మరోవైపు బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానితో రకుల్ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీరు త్వరలో పెళ్లి చేసుకోనున్నారని రకుల్ తమ్ముడు అమన్ ప్రీత్ చెప్పినట్టు ఇటీవల వార్తలు వినిపించాయి. ఈ విషయంపై రకుల్ స్పందిస్తూ.. ‘నా పెళ్లి గురించి నువ్వు నిజంగానే స్పష్టతనిచ్చావా..? నా పెళ్లి గురించి నాకు కూడా చెప్పాలి కదా బ్రో.. నా జీవితం గురించి నాకే తెలియకపోవడం హాస్యస్పదంగా ఉంది’ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం రకుల్ డాక్టర్ జీ సినిమా అక్టోబర్ 14న విడుదలవ్వనుంది. మరోవైపు ఛత్రివాలి,థ్యాంక్గాడ్, ఇండియన్-2 సినిమాల్లో నటిస్తోంది.
Also Read : జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి గురించి వల్లభనేని వంశీ ఏమన్నారంటే ?