Home » భ‌ర్త‌కు గుడ్ బై చెప్పిన కాంట్ర‌వ‌ర్సీ బ్యూటీ

భ‌ర్త‌కు గుడ్ బై చెప్పిన కాంట్ర‌వ‌ర్సీ బ్యూటీ

by Anji
Ad

ప్రేమికుల‌కు ప్ర‌త్యేక‌మైన వాలంటైన్స్ డే అన‌గానే ప్ర‌పోజ‌ల్ మాత్ర‌మే గుర్తు వ‌స్తుంది. అయితే ఓ కాంట్ర‌వ‌ర్సీ బ్యూటీ మాత్రం ఈ స్పెష‌ల్ మ‌రింత‌గా గుర్తిండిపోయేలా భ‌ర్త‌కు గుడ్ బై చెప్పేసింది. బాలీవుడ్ డ్రామా క్వీన్ రాఖీ సావంత్ 2019 ఎన్నారై రితేష్‌ను పెళ్లాడింది. అయితే బిగ్‌బాస్ 15కి ముందు రాఖీ భ‌ర్త రితేష్‌ను ఎవ్వ‌రూ చూడ‌లేదు. అయితే బిగ్‌బాస్ నుంచి రాఖీ బ‌య‌ట‌కు రాగానే తాను, రితేష్‌ను చ‌ట్ట‌బ‌ద్ధంగా పెళ్లి చేసుకోలేద‌ని చెప్పి అంద‌రికీ షాక్ ఇచ్చింది రాఖీ.

Also Read :  ఐపీఎల్ మెగా వేలంలో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచిన‌ కావ్య‌మార‌న్ గురించి తెలుసా..?

Advertisement

Advertisement

 

ఇంకొక ఆస‌క్తిక‌ర విష‌యం ఏమిటంటే రితేష్‌కు అప్ప‌టికే పెళ్లి అయింది. రితేష్ మొద‌టి భార్య పేరు పేరు స్నిగ్ద. ఓ ఇంట‌ర్వ్యూలో ఆమె భ‌ర్త రితేష్ పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేసింది. తాజా ఆప్‌డేట్ ఏమిటంటే.. రాఖీ, రితేష్ విడిపోయారు.

రాఖీ సావంత్ స్వ‌యంగా పోస్ట్ ద్వారా రితేష్‌తో విడిపోయిన విష‌యాన్ని తెలియ‌జేసింది. అభిమానులు, నా ప్రియ‌మైన వారందరికీ నేను రితేష్ విడిపోయామ‌ని మీకు చెప్పాల‌నుకుంటున్నాం. బిగ్‌బాస్ త‌రువాత చాలా జ‌రిగాయి. చాలా విష‌యాలు నా నియంత్ర‌ణ‌లో లేవు. మేము చాలా ప్ర‌య‌త్నించాం. కానీ చివ‌రికీ మేము మా జీవితాలను విడిగా గ‌డ‌పాల‌ని నిర్ణ‌యించుకున్నాం అంటూ బ్రేక‌ప్ విష‌యాన్ని వెల్ల‌డించింది. వాలంటైన్స్ డే రోజు బ్రేక‌ప్ ఇవ్వ‌డం కాస్త వెరైటీనే అని చెప్ప‌వ‌చ్చు.

Also Read :  చిరంజీవి: అందుకే మెగాస్టార్ అయ్యారా..?

Visitors Are Also Reading